husband kills wife and informs family on whatsapp in bengaluru
Crime News : పెళ్లి చేసుకున్న భార్య అందంగా ఉన్నా సమస్యే ఈరోజుల్లో. అందంగా లేకపోయినా సమస్యే. ఎందుకంటే.. భార్య అందంగా ఉంటే పది మంది కళ్లు తన మీదే ఉంటాయి. దీంతో తనను కాపాడుకోవడమే భర్త పని అవుతుంది. అదే అందంగా లేకపోతే.. తన భార్య అందంగా లేదని పది మంది పది రకాలుగా అనుకుంటారు. ఇలా.. ఎటువెళ్లినా చిక్కే కదా. ఇలాగే ఓ వ్యక్తి తన భార్య అందంగా ఉండటం వల్ల తన మీద అనుమానం పెంచుకున్నాడు. ఆమెకు ఎవరితోనైనా అక్రమ సంబంధం ఉందేమో అని అనుమానించేవాడు. నిత్యం తనను వేధించేవాడు.
husband kills wife and informs family on whatsapp in bengaluru
బెంగళూరుకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తికి నాజ్ అనే 22 ఏళ్ల యువతితో గత సంవత్సరం జూన్ లో పెళ్లి జరిగింది. వీళ్లిద్దరూ నగరంలోని సుభాష్ నగర్ లో ఉంటున్నారు. అయితే.. నాజ్ బెంగళూరులోనే ఓ కంపెనీలో పని చేసేది. తను చాలా అందంగా ఉండటం వల్ల.. తన భార్య అందాన్ని చూసి హుస్సేన్ కు అనుమానం కలిగేది. ఆఫీసులో ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందేమోనని అనుమానించేవాడు. కంపెనీలో ఉద్యోగితో సంబంధం పెట్టుకున్నావా అని తరుచూ వేధించేవాడు. చివరకు కోపంతో ఇటీవల ఆమె గొంతు నులిమి చంపేశాడు.
నాజ్ ను చంపేసి ఆ తర్వాత ఆమె సోదరుడికి ఉదయమే వాట్సప్ లో మెసేజ్ పెట్టాడు. తాను నాజ్ ను చంపేశానని.. వచ్చి ఆమె బాడీని తీసుకెళ్లాలని చెప్పాడు. షాక్ అయిన నాజ్ సోదరుడు వెంటనే బెంగళూరుకు చేరుకొని సోదరి మృతదేహాన్ని చూసి విలవిల్లాడాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే.. తనను నాజ్ కుటుంబ సభ్యులు ఏం చేస్తారో అని భయపడి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో హుస్సేన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Water | చాలా మందిలో కనిపించే సాధారణ అలవాటు..భోజనం చేస్తూనే లేదా చేసిన వెంటనే నీళ్లు తాగడం. అయితే ఆరోగ్య…
EGG | మార్కెట్లలో గుడ్లు చౌకగా లభించడంతో, చాలా మంది ఒకేసారి డజన్ల కొద్దీ గుడ్లు కొనుగోలు చేస్తున్నారు. అలాగే…
Hibiscus Plant Vastu Tips | భారతీయ సంప్రదాయంలో మొక్కలు, పూలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. పూజల్లో, వాస్తులో, ఆరోగ్య…
GST 2.0 Effect Gold Price Reduce : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వ్యవస్థలో తీసుకొచ్చిన తాజా సంస్కరణలు విప్లవాత్మకమని…
Best Govt Jobs : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎప్పటి నుంచీ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. స్థిరమైన జీతం, భద్రమైన…
Lokesh Delhi Tour : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తాజాగా ఢిల్లీ పర్యటన…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరోసారి రైతు సమస్యల పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ నెల 9వ తేదీన యూరియా…
Harish Rao met with KCR : BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన ఎర్రవల్లిలోని ఫామ్హౌస్లో శనివారం…
This website uses cookies.