Best Scheme : ప్రస్తుతం చాలామంది సంపాదించిన డబ్బును పొదుపు చేయాలని ఆలోచిస్తున్నారు. చాలామంది పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో డబ్బులు పొదుపు చేస్తూ ఉంటారు. లేదంటే ఏదైనా బ్యాంకు పథకాలలో డబ్బులు దాచి పెడుతూ ఉంటారు. అయితే వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ రాబడి వస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో ఏడు శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ రేటు ప్రాతిపదికన చూస్తే డబ్బులు రెట్టింపు కావాలంటే ఏకంగా పదేళ్లకు పైన పడుతుంది. ఇలా కాకుండా ఐదేళ్ళలోనే డబ్బులను రెట్టింపు చేసే పథకాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే వీటిల్లో కొద్దిగా రిస్క్ ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్ కు చెందని ఈక్విటీ స్కీమ్స్ లో అధిక రాబడి పొందవచ్చు. ఈ స్కీమ్స్ మార్కెట్ రిస్కుకు లోబడి ఉంటాయి. అందువల్ల డబ్బులు పెట్టేవారు రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అయితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు అని నిపుణులు అంటున్నారు. ఐదేళ్ల కాలంలో అధిక రాబడి అందించిన కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ టెక్నాలజీ ఫండ్ ఐదేళ్ల రాబడి 26% పైగా ఉంది. అంటే ఐదేళ్ల కిందట ఈ ఫండ్ లో లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు 3.21 లక్షలు వచ్చేవి. అదే నెలకు పదివేలు సిప్ చేసి ఉంటే 14 లక్షలు పైగా వచేవి. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ రెగ్యులర్ స్కీం లో భారీ రాబడి పొందవచ్చు.
ఈ రాబడి 25 శాతానికి పైగా ఉంది. అంటే లక్ష పొదుపు చేసి ఉంటే ఇప్పుడు 3.13 లక్షలు వచ్చేవి. అంటే నెలకు పదివేలు పెడుతూ వచ్చి ఉంటే ఇప్పుడు 13.79 లక్షలు వచ్చేవి. ఎస్బిఐ టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఫండ్ కూడా ఉంది. ఫండ్ ఐదేళ్ల రాబడి 24% గా ఉంది. అంటే ఐదేళ్ల కిందట ఈ ఫండ్ లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు మూడు లక్షలు వచ్చేవి. నెలకు పదివేలు పెడుతూ వచ్చి ఉంటే ఇప్పుడు 13.5 లక్షలు వచ్చేవి. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డిజిటల్ ఇండియా ఫండ్ కూడా ఉంది. దీని ఐదేళ్ల రాబడి 24.71% అంటే ఐదేళ్ల కిందట ఈ ఫండ్ లో లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు 3.1 లక్షలు వచ్చేవి. అదే సిప్ చేసి ఉంటే ఇప్పుడు 13.7 లక్షలు లభించేవి.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.