7th Pay Commission good news to central govt employees about da hike
7th Pay Commission: కొద్ది రోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు డీఏ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో శుభవార్త అని చెప్పకనే చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు ప్రయోజనాన్ని కల్పించే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.. మార్చి నెల జీతం తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు కూడా రానున్న ప్రయోజనాలు కూడా ఖాతాలో జమ కానున్నాయి. డియర్ నెస్ అలవెన్స్ తో పాటు ఎన్నో ప్రయోజనాలను కూడా విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ఈసారి మూడు శాతం డీఏ పెరుగుతుందని ఇదే జరిగితే 34 శాతం డీఏను ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లు అందుకోబోతున్నారు అని సమాచారం.
సోమవారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 7వ వేతన సంఘం కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన 20% బకాయిలను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు ఇప్పుడు వారి మార్చి జీతంతో పాటు బకాయిలను పొందుతారు. దాదాపు 4 లక్షల మంది ఉద్యోగులు తమ మార్చి జీతంతో పాటు బకాయిలను అందుకోనున్నారు అని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 2021-22 సప్లిమెంటరీ బడ్జెట్లో అదనంగా రూ.850 కోట్లు కేటాయించినట్లు తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 80 శాతం పే కమీషన్ జీతాల శ్లాబ్ బకాయిలు అందాయని, ఆలస్యమైన బకాయిలను విడుదల చేయడం వల్ల దాదాపు 4 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.
7th pay commission pending da arrears to be released along with marchs salary
ఒడిశా ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సులను ఆమోదించి జనవరి 2016లో వాటిని అమలు చేయడం ప్రారంభించిందని గమనించడం ముఖ్యం. ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగింది. 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు జనవరి 2014 నుంచి ఆగస్టు 2018 మధ్య కాలంలో 20 నెలలకు పెంచిన బకాయిలను వివిధ వాయిదాల్లో చెల్లించాలని నిర్ణయించారు.నిర్ణయం ప్రకారం, పెరిగిన వేతనంలో 2016-17లో 40 శాతం, 2019-20లో 10 శాతం మరియు 2021-22లో 30 శాతం క్లియర్ చేయబడింది. పెన్షనర్లు కూడా 100 శాతం జీతాలు పొందడం గమనార్హం. అలాగే కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏను 31% నుంచి 34%కి పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి.
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
This website uses cookies.