Home » News » Apple Iphone 14 Series Phone At Rs58000 Discount
News

Iphone 14 : ఆపిల్ ఐఫోన్ 14 ఫోన్ పై బంపర్ ఆఫర్…ఈ ఫోన్ పై రూ.58 వేల తగ్గింపు…

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: September 15, 2022, 7:30 am
Advertisement

Iphone 14 : కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారు మార్కెట్లో ఉన్న ఆఫర్లను చూసి కొనుక్కుంటే మంచిది. ఈ మధ్యనే ఆపిల్ ఐఫోన్లు కొత్త సిరీస్ తో మార్కెట్లోకి విడుదలయ్యాయి. కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారు ఈ ఫోన్ ఆఫర్ల తెలుసుకొని కొనుగోలు చేయండి. ఆపిల్ లో కూడా లేటెస్ట్ ఐఫోన్ మోడల్స్ లో అందుబాటులోకి వచ్చాయి. భారీ ఆఫర్లతో తగ్గింపు ధరతో వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎక్సైంజ్ ఆఫర్ కింద ఐఫోన్ లేటెస్ట్ మోడల్ లను కొనుగోలు చేస్తే 50 వేలకు పైగా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆపిల్ కంపెనీ ఇటీవలనే ఐఫోన్ 14 సిరీస్ ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ సిరీస్ లో నాలుగు ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.

Advertisement

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫోన్లు ప్రీ బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. కొనుగోలు చేయాలని అనుకునేవారు ముందుగానే ఆర్డర్ ఇవ్వచ్చు. తర్వాత ఇది వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. అయితే ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఫోన్లు కొనాలనుకునే వారికి ట్రేడ్ ఇన్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే మీ వద్ద ఉన్న పాత ఐఫోన్ ఇచ్చి కొత్త ఐఫోన్ కొంటే భారీ తగ్గింపు పొందవచ్చు. అలాగే ఇతర కంపెనీల స్మార్ట్ ఫోన్స్ కూడా ఈ ఆఫర్ ని సొంతం చేసుకోవచ్చు. అయితే తగ్గింపు మాత్రం తక్కువగానే ఉంటుంది.

Apple iphone 14 series phone at rs58,000 discount

Advertisement

ఆపిల్ ట్రేడ్ ఇన్ ఆఫర్ కింద 14 ప్రో మ్యాక్స్ కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.58,730 వరకు తగ్గింపు ధర లభిస్తుంది. అంతేకాకుండా క్యాష్ బ్యాక్, నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఈ ఫోను కొనుగోలు చేస్తే 6000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అయితే 54,900 విలువైన ట్రాన్సాక్షన్ నిర్వహిస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇంకా ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ఇవి కాకుండా వినియోగదారులు క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొత్త ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఈఎమ్ ఐ ఆప్షన్ వలన ఎక్కువ వడ్డీ పడుతుంది. అందువల్ల డబ్బులు ఉంటే ఒకేసారి చెల్లించి ఐఫోన్ సొంతం చేసుకోవడం మంచిది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి