
Budget 2026 : గుడ్న్యూస్.. కిసాన్ సమ్మాన్ నిధి పెంపు.. రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్?..ఇంకా మరెన్నో..!
Budget 2026 : దేశ ఆర్థిక పరిస్థితిని మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం Central Govt తీసుకురాబోయే బడ్జెట్ 2026లో అనేక కీలక నిర్ణయాలు ఉండనున్నాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, రైతులు, వృద్ధులకు ఊరటనిచ్చే ప్రకటనలు ఉండే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. వినియోగాన్ని పెంచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, మౌలిక వసతులను మెరుగుపరచడం ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఆదాయపు పన్ను, కిసాన్ సమ్మాన్ నిధి, రైల్వేలు ఈసారి బడ్జెట్లో ప్రత్యేక దృష్టిని ఆకర్షించనున్నాయి…
Budget 2026 : గుడ్న్యూస్.. కిసాన్ సమ్మాన్ నిధి పెంపు.. రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్?..ఇంకా మరెన్నో..!
బడ్జెట్ 2026లో కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేయవచ్చని అంచనాలు ఉన్నాయి. జీతం పొందే ఉద్యోగులకు ప్రామాణిక మినహాయింపును రూ.1 లక్షకు పెంచే అవకాశముందని సమాచారం. దీనివల్ల వార్షికంగా రూ.13 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పూర్తిగా పన్ను మినహాయింపును పొందే వీలుంటుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.12.75 లక్షల వరకే ఉంది. పాత పన్ను విధానాన్ని విడిచిపెట్టి కొత్త విధానాన్ని ఎంచుకునేలా ప్రజలను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ పన్ను ఊరట వల్ల ప్రజల చేతుల్లో ఖర్చు చేయడానికి ఎక్కువ డబ్బు మిగులుతుంది. దాంతో మార్కెట్లో వినియోగం పెరిగి ఆర్థిక చక్రం వేగంగా తిరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ప్రస్తుతం అందుతున్న వార్షిక సహాయాన్ని రూ.6,000 నుండి రూ.9,000కు పెంచవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ డిమాండ్ను రైతు సంఘాలు చాలా కాలంగా లేవనెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ పథకం ద్వారా సుమారు 110 మిలియన్ల రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. సహాయం పెరిగితే ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ.95,000 కోట్ల వరకు వ్యయం పెరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది చిన్న రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలు తీర్చుకోవడంలో నేరుగా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రామీణ ఆదాయం పెరగడం వల్ల మొత్తం ఆర్థిక వ్యవస్థపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
రైల్వే రంగంలోనూ బడ్జెట్ 2026 కీలక మలుపు తిప్పనుందని అంచనాలు ఉన్నాయి. 2030 నాటికి రైలు రిజర్వేషన్లలో వెయిటింగ్ లిస్ట్ సమస్యను పూర్తిగా తొలగించడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. ఇందుకోసం 300కి పైగా వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రకటించే అవకాశం ఉంది. గత బడ్జెట్లో రైల్వేలకు రికార్డు స్థాయిలో రూ.2.65 లక్షల కోట్ల నిధులు కేటాయించారు. ఈసారి కూడా ఈ మొత్తాన్ని మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త రైళ్లు, స్టేషన్ అభివృద్ధి, భద్రతా చర్యలతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇది ఉపాధి అవకాశాలను పెంచడమే కాకుండా దేశ మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద తోడ్పాటు అందించనుంది. బడ్జెట్ 2026 దేశవ్యాప్తంగా ప్రజలకు ఆశలు రేకెత్తించే నిర్ణయాలతో రానుందని అంచనా. పన్ను ఊరట రైతులకు మద్దతు రైల్వే విస్తరణ అన్ని దేశ ఆర్థిక ప్రయాణానికి కొత్త దిశ చూపించే అవకాశం ఉంది…
Union Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ Nirmala Sitharaman Budget…
Union Budget 2026 Live Updates : దేశ ఆర్థిక దిశను నిర్ణయించే కేంద్ర బడ్జెట్ 2026పై యావత్ దేశం…
Union Budget 2026 : కేంద్ర ప్రభుత్వం 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ Budget 2026-27 ను ఆదివారం పార్లమెంటులో…
Union Budget 2026 : Nirmala Sitharaman Budget 2026 సాధారణంగా సెలవు దినాల్లో ప్రభుత్వ అధికారిక కార్యకలాపాలు జరగవు,…
Jio Electric Scooter : జియోతో టెలికామ్ రంగంలో విప్లవం సృష్టించిన ముఖేష్ అంబానీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి…
Ambati Rambabu Arrest : వైసీపీ సీనియర్ నేత YCP Ambati Rambabu Arrest , మాజీ మంత్రి అంబటి…
Today Gold Price : కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ పసిడి Today Gold Rates ప్రియులకు ఊహించని శుభవార్త…
cancer : ప్రస్తుత కాలంలో క్యాన్సర్ అనేది చాప కింద నీరులా విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల…
This website uses cookies.