bihar man won 1 crore rupees on dream 11 app
డ్రీమ్ 11.. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ గురించి చాలా మందికి తెలుసు. ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ఉపయోగించి చాలా మంది ఇందులో డబ్బులు గెలుచుకోవాలని ప్రయత్నిస్తుంటారు. బీహార్లోని నవాడా జిల్లాకు చెందిన రాజు రామ్ డ్రీమ్ 11 అనే యాప్లో క్రికెట్ గేమ్ కోటి రూపాయలు గెలుపొంది అందరిని ఆశ్చర్యపరిచాడు.ఈ విషయం తెలుసుకొని ఆయన కుటుంబసభ్యులు చాలా సంతోషించారు.ఆయన గెలిచిన మొత్తం అతని ఖాతాకు కూడా బదిలీ చేయబడింది. అయితే గత ఏడాదిన్నరగా డ్రీమ్ 11 ప్లేయింగ్ యాప్లో గేమ్ ఆడుతున్నట్లు రాజు చెప్పుకొచ్చాడు. తాజాగా బ్రిస్బేన్ హీట్ వర్సెస్ సిడ్నీ థండర్ మ్యాచ్లో రూ.49 పెట్టి గేమ్ ఆడగా,
అందులో అగ్రస్థానంలో నిలిచి కోటిరూపాయలు సంపాదించడం విశేషం. ఇంతకముందు రాజు చిన్న మొత్తంలో కూడా గెలుస్తూ ఉండేవాడు. తన గ్రామంలోనే డీజే ఆపరేటర్గా పని చేసే అతను చిన్నపాటి దుకాణం కూడా నడుపుతున్నాడు. కానీ, ఇంతలో రాజు రామ్ కోటి రూపాయలు దక్కించుకొని ఔరా అనిపించాడు. అతని ఫేట్ రాత్రికి రాత్రే మారిపోయింది. తాను గేమ్ ఆడుతున్న సమయంలో దాదాపు 35 లక్షల మంది ఒకేసారి ఆ గేమ్ను ఆడేవారని కూడా రాజు చెప్పారు. అతను బ్రిస్బేన్ హీట్ మరియు సిడ్నీ థండర్ జట్టు నుండి ఆటగాళ్లను ఎంపిక చేసి ఒక జట్టును తయారు చేసి, గెలిచి కోటి రూపాయలు గెలుచుకోవడం విశేషం. గెలుచుకున్న మొత్తంలో పన్ను తీసివేయగా.. రూ.70 లక్షలు అతడి అకౌంట్లో జమయ్యాయి. అయితే..
bihar man won 1 crore rupees on dream 11 app
రాజురామ్ కు వాలెట్ లో డబ్బులు ఎందుకు యాడ్ అయ్యాయన్న విషయం ముందు అర్థం కాలేదు. రూ.75 లక్షలు సంపాదించడం సంతోషంగా ఉందని ఆయన చెప్పాడు. అయితే.. దేశంలో పలు రాష్ట్రాలలో గేమింగ్ యాపులపై నిషేధం ఉంది. అయినా ఏదో ఒక రకంగా బెట్టింగ్ కాస్తూనే వస్తున్నారు. వచ్చిన వాళ్లకి డబ్బులు బాగానే వస్తున్నాయి. కొందరు చాలా నష్టపోతున్నారు. అయితే ఇంతకు ముందు బీహార్లోని అర్రాలో, ఆన్లైన్ గేమింగ్ యాప్ డ్రీమ్-11 నుండి ఒక వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్న విషయం విదితమే. అర్రా జిల్లా చార్పోఖారీ బ్లాక్ ఠాకూరి గ్రామానికి చెందిన వెంకటేష్ సింగ్ కుమారుడు సౌరభ్ కుమార్ డ్రీమ్-11 విజేతగా నిలిచి వార్తలలోకి ఎక్కాడు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.