Home » Andhra Pradesh » Breaking Nandamuri Taraka Ratna Among The Living And Dead
andhra pradesh

Breaking : చావు బతుకుల మధ్య నందమూరి తారకరత్న..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: January 27, 2023 1:44 pm
Advertisement

Breaking : నందమూరి కాంపౌండ్ నుండి వెండితెరకు పరిచయమైన హీరోలలో నందమూరి తారకరత్న ఒకరు. స్టార్టింగ్ లో కొన్ని సినిమాలు చేసిన తారకరత్న ఆ తర్వాత.. ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇటీవల మళ్ళీ పలు సినిమాలలో కీలకమైన పాత్రలు చేస్తూ మళ్ళీ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి పలు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. వైసీపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే జనవరి 27 కుప్పం నియోజకవర్గం నుండి నారా లోకేష్

Advertisement

“యువగళ్ళం” పేరిట పాదయాత్ర స్టార్ట్ చేయడం తెలిసిందే. ఈ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. విషయంలోకీ వెళ్తే పాదయాత్ర ప్రారంభమయ్యాక కుప్పం సమీపంలో ఓ మసీదులో లోకేష్ ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. తారకరత్న కూడా పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో మసీదు నుండి లోకేష్ బయటకు రాగానే ఒక్కసారిగా తోపులాట జరగటంతో.. కార్యకర్తలు భారీగా తరలిరావడంతో… ఆ తాకిడికి తారకరత్న సోమ్మసిల్లి పడిపోయాడు.

Breaking nandamuri Taraka Ratna among the living and dead

Advertisement

దీంతో వెంటనే అప్రమత్తమైన టీడీపీ నేతలు తారకరత్ననీ కుప్పంలో కేసీ అనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించడం జరిగింది. ఈ క్రమంలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యుల సూచనల మేరకు… అనంతరం మెరుగైన వైద్యం కోసం పీఈ మెడికల్ ఆసుపత్రికి టీడీపీ నాయకులు తరలించడం జరిగింది. అయితే ఆయన పరిస్థితి అక్కడ కూడా చావు బతుకుల మధ్య మరింత కఠినంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామంతో ఇప్పుడు తారకరత్ననీ బెంగళూరు తరలించడానికి టీడీపీ పెద్దలు డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి