chandrababu forgot amaravathi address
అసలు చంద్రబాబు అంటేనే ఇప్పుడు ఏపీలో గుర్తుపట్టని స్టేజ్ కు చేరుకున్నారు ఏపీ ప్రజలు. ఎందుకంటే.. చంద్రబాబు ఎక్కువగా ఉండేది హైదరాబాద్ లో. అంటే వేరే రాష్ట్రంలో. ఎప్పుడో అమావాస్య పున్నమికి ఏపీకి వస్తే ఎవరికి మాత్రం గుర్తుంటుంది. అందుకే.. చంద్రబాబు అమరావతి అడ్రస్ ను మరిచిపోవడం కాదు.. అసలు ఏపీ ప్రజలే చంద్రబాబును మరిచిపోయే స్థితికి చేరుకున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
chandrababu forgot amaravathi address
ఇది సంక్రాంతి సీజన్. సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ బోగి మంటలు వేసుకొని.. మకర సంక్రాంతి, కనుమ కన్నుల పండువగా జరుపుకుంటారు. ఏపీలో గత సంవత్సరం నుంచి అమరావతి ఉద్యమం నడుస్తోంది. వాళ్లకు టీడీపీ కూడా మద్దతు ఇస్తోంది.
అందుకే 2020లో సంక్రాంతి పండుగను చంద్రబాబు అమరావతి రైతులతో కలిసి జరుపుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మూడు రాజధానులను ప్రకటించగానే అమరావతికి జగన్ అన్యాయం చేశారంటూ చంద్రబాబు విమర్శించారు. అలాగే అమరావతి రైతులు కూడా ఉద్యమం చేస్తున్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వాళ్ల ఉద్యమం సాగుతూనే ఉన్నది. కానీ.. ఈసారి 2021 సంక్రాంతికి చంద్రబాబు అమరావతి రైతుల దగ్గరికి వెళ్లలేదు. వాళ్లతో సంక్రాంతి సంబురాలు జరుపుకోలేదు.
ఈసారి చంద్రబాబు వెరైటీగా కృష్ణా జిల్లా పరిటాలలో సంక్రాంతి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఊరుకుంటారా? అదేంటి.. చంద్రబాబు అమరావతి అడ్రస్ మరిచిపోయారా? 2020 లో గుర్తున్న వీళ్లు.. 2021 వచ్చేసరికి గుర్తు రాలేదా? ఏంటి బాబు.. ఇలా చేశారు. అమరావతి సృష్టించిందే చంద్రబాబు.. ఆయన చెప్పారని.. రైతులంతా తమ భూమిని ఇచ్చేశారు. ఇప్పటికీ వాళ్లు ఉద్యమం చేస్తున్నారు. కానీ.. చంద్రబాబే మారిపోయారు.. అంటూ వార్తలు వస్తున్నాయి.
మరి.. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి.. అనే నినాదానికి చంద్రబాబు నీళ్లొదిలినట్టేనా? అంటే మాత్రం దానికి కాలమే సమాధానం చెప్పాలి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.