Pawan Kalyan : ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయాత్తం అవుతున్నాయి. తమ పార్టీల అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఇక.. ప్రధాన పార్టీల అధినేతలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే దానిపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. 2019 ఎన్నికల్లో ఆయన గాజువాక నుంచి పోటీ చేశారు. భీమవరం నుంచి కూడా పోటీ చేశారు. కానీ.. రెండు నియోజకవర్గాల్లో ఓడిపోయారు. మరి.. ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? లేక ఆ రెండు కాకుండా వేరే నియోజకవర్గం చూసుకుంటారా? అనేదానిపై ఇన్ని రోజులు క్లారిటీ రాలేదు కానీ.. ప్రస్తుతం ఆయన గాజువాకలో వారాహి యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే కదా.
దీంతో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తన మనసులో మాట చెప్పేశారు. అసలు తను గాజువాక నుంచి పోటీ చేస్తే ఎందుకు ఓడించారు అనేదే తనకు అర్థం కావడం లేదని గాజువాక మీటింగ్ లో స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. తనను ఆ ఎన్నికల్లో గెలిపించి ఉంటే బాగుండేది కదా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ.. 2019 ఎన్నికల్లో ఓడించినా సరే.. 2024 ఎన్నికల్లో గాజువాకలో జనసేన ఖచ్చితంగా గెలిచి తీరుతుంది అంటూ స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. గాజువాకలో జనసేన గెలుస్తుంది కానీ.. జనసేన అభ్యర్థి ఎవరు అనే దానిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.
clarity on pawan kalyan constituency in ap
కానీ.. జనసైనికులు, జనసేన నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ ను మరోసారి గాజువాక నుంచే బరిలోకి దిగాలని కోరుతున్నారు. గాజువాకలో పవన్ ఓడిపోయారు అని ఇతర పార్టీల నేతలు పవన్ ను ఎగతాళి చేస్తున్నారు కదా. అందుకే 2024 లో మళ్లీ గాజువాకలో నిలబడి అక్కడి నుంచి గెలిచి చూపించి తన సత్తా చాటాలని అప్పుడే పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో అందరికీ తెలుస్తుందని జనసైనికులు భావిస్తున్నారు. పవన్ మనసులో కూడా అదే ఉన్నట్టు ఆయన ప్రసంగంలో తెలిసిపోయింది. అంటే.. వచ్చే ఎన్నికల్లో గాజువాకలో పోటీ చేసి గెలిచి తొలిసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారన్నమాట.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.