Categories: News

girls kidnapped in Nigeria : నైజీరియాలో భారీ సంఖ్యలో బాలికల కిడ్నప్.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

girls kidnapped in Nigeria : నైజీరియాలో మరోసారి దారుణం చోటు చేసుకుంది. కొంతమంది దుండగులు తుపాకులతో ఓ బాలికల పాఠశాలలోకి ప్రవేశించి, తుపాకులతో బెదిరించి 317 మంది బాలికలను కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన బాలికలంతా 10 నుంచి 13 సంవత్సరాల వయసుకలిగిన వారే. నైజీరియాలోని జామ్ ఫారా రాష్ట్రంలోని జంగేబే గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన జరిగే కంటే ముందు దుండగులు సైనిక శిబిరంపైన, చెక్ పాయింట్ పైనా కాల్పులకు పాల్పడినట్టు పోలీసులు చెప్తున్నారు. కిడ్నాప్ చేసి బాలికలను సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి ఉంటారని అధికారులు చెప్తున్నారు. కిడ్నాప్ కు గురైన బాలికలను సురక్షితంగా రక్షించేందుకు పోలీసులు, మిలటరీ సంయుక్త ఆపరేషన్ ను ప్రారంభించింది.

girls kidnapped in Nigeria : గతంలో 276 మంది బాలికలు

గతంలో 2014లో బోర్నో స్టేట్ లోని చిబోక్ పాఠశాలలో ఉన్న 276 మంది బాలికలను ఇలానే కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లారు. అయితే, పోలీసులు వీరిని విడిపించారు. కానీ, ఇందులో 100 మంది బాలికలు ఏమయ్యారు అన్నది ఇప్పటి వరకు తెలియలేదు. ఇప్పుడు మరోసారి తాజాగా ఈ దారుణం చోటు చేసుకుంది. నైజీరియాలో బోకోహారం ఉగ్రవాదులకు అడ్డూ అదుపూ ఉండదు. వారిని నియంత్రించే ప్రభుత్వాలు ఇంతవరకూ పుట్టలేదు.

ఇటీవల కాలంలో స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో విద్యార్థులను అపహరించడం యధేచ్ఛగా జరిగిపోతోంది..పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ఆయుధాలతో తిరిగే ముఠాల సభ్యులు స్కూలు పిల్లలను బంధించడం ఇక్కడ తరచుగా జరుగుతూ ఉంటుంది. గత వారం నైజర్ సెంట్రల్ స్టేట్‌లో అపహరణకు గురైన 42 మందిని ఇంకా విడుదల చేయలేదు. అందులో 27 మంది విద్యార్థులు కూడా ఉన్నారు. పోయినేడాది డిసెంబరులోనూ దుండగులు 300 మందికి పైగా అబ్బాయిలను అపహరించి చర్చల తర్వాత వదిలి పెట్టారు.

బాలికలే ఎందుకు

తాజాగా జరిగిన ఘటనలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ భద్రతాదళాలకు చెందినవారిలా దుస్తులు ధరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఆ పాఠశాలలో పనిచేసే టీచర్ చెబుతోంది.సాయుధులైన వ్యక్తులు విద్యార్థులను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లి వాహనాలలోకి ఎక్కించి తీసుకుని వెళ్లినట్లు సమాచారం. విద్యార్థుల అపహరణ సమాచారం తెలిసినవెంటనే పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. స్కూలు చుట్టుపక్కల ఉన్న పొదల్లో తమ పిల్లల కోసం వెతుకుతూ కనిపించారు. దాడి జరిగిన సమయంలో 421 మంది విద్యార్థులు ఉండగా కేవలం 55 మంది మాత్రమే స్కూలులో మిగిలారు. మిగిలిన వారంతా అపహరణకు గురయ్యారని టీచర్ చెప్పారు. ఉత్తర నైజీరియాలో ఆయుధాలు ధరించిన దుండగులు విద్యార్థులను అపహరించిన ప్రతి సారి 2014లో జరిగిన చిబోక్ అమ్మాయిల కిడ్నాప్ తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఈ ప్రాంతంలో గతంలో కూడా విద్యార్థులను స్కూళ్ల నుంచి అపహరించినప్పటికీ ఆ విషయాయలు బయటకు పొక్కలేదు.

నిజానికి ఆరోజు చిబోక్ అమ్మాయిలను ఎత్తుకుని వెళ్లిన బోకో హరామ్ సభ్యులు వారిని అపహరించాలనే ప్రణాళికతో రాలేదు. కానీ, స్కూలులో ఉన్న బల్లలను దొంగలించాలని వచ్చారు. కానీ అనుకోకుండా తమ దళాల్లో వారితో పెళ్లి జరిపించేందుకు అమ్మాయిలను వెంట తీసుకుపోయారు. దాంతో ఆ విషయానికి బాగా ప్రచారం లభించింది. ప్రభుత్వం కూడా దిగిరావడంతో ఇకపై పిల్లలను అపహరించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పిల్లలను స్కూళ్ల నుంచి అపహరించడం వల్ల ప్రభుత్వం తమ షరతులకు డిమాండ్లకు తేలికగా ఒప్పుకుంటోంది. అయితే కిడ్నాపైన వారి విడుదల కోసం పెద్ద మొత్తంలో సొమ్మును, ఆయుధాలను ఉగ్రవాదులకు ఇస్తున్నారన్న వాదనను నైజీరియా ప్రభుత్వం ఖండిస్తోంది. పిల్లల కిడ్నాప్‌లు ఆపడానికి ప్రభుత్వం దగ్గర ఎటువంటి వ్యూహం ఉన్నట్లు కనిపించటం లేదు.

Recent Posts

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌ ఆప‌రేష‌న్‌కు ప్ర‌భాస్ భారీ సాయం..!

Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…

29 minutes ago

Janasena : టీడీపీ ని కాదని జనసేన మరో రూట్ ఎంచుకోబోతుందా..?

Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP  ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…

1 hour ago

Thammudu Movie : త‌మ్ముడులో ల‌య‌కి బ‌దులుగా ముందు ఆ హీరోయిన్‌ని అనుకున్నారా..!

Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…

2 hours ago

Chandrababu : చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పే చేస్తున్నాడా..?

Chandrababu  : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…

3 hours ago

Pakiza : ఇంకో జన్మ అంటూ ఉంటే.. నేను చిరంజీవి ఇంట్లో కుక్కగా పుట్టాలి .. పాకీజా కామెంట్స్.. వీడియో

Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్‌ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…

4 hours ago

Rain Water : వర్షపు నీరు ఎప్పుడైనా తాగారా… ఇది ఆరోగ్యానికి మంచిదేనా…?

Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…

5 hours ago

Gk Fact Osk : కోడి కూడా ఈ దేశానికి జాతీయ పక్షి… మీకు తెలుసా…?

Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…

7 hours ago

Sugar Patients : డయాబెటిస్ పేషెంట్లు గుడ్లు తినవచ్చా… ఒకవేళ తింటే ఏం జరుగుతుంది…?

Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…

7 hours ago