
Haryana News court punished jalebi baba
Haryana News : భారతదేశంలో బాబాలకు కొదువ ఉండదన్న సంగతి తెలిసిందే. సినిమా సెలబ్రిటీలు మొదలుకొని రాజకీయ నాయకులు సైతం ఎక్కువగా బాబాలనే ఆశ్రయిస్తారు. ఎందుకంటే మనదేశంలో చాలామంది భగవంతుని బలంగా నమ్ముతారు. దీంతో ఆ సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవడానికి సమాజంలో రకరకాల బాబాలు పుట్టుకొస్తూ ఉంటారు. ఇండియాలో వ్యాపారవేత్తల కంటే బాబా అవతారం ఎత్తిన వారి బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు ఉంటది. సంవత్సరాలలోనే బ్రాంచీలు కూడా స్టార్ట్ చేసేస్తారు. అంతగా భారతీయులు బాబాలు పట్ల నమ్మకాలు చూపుతారు. ఇదే సమయంలో బాబా ముసుగులో చాలామంది రకరకాలుగా అఘాయిత్యాలకు పాల్పడటం కూడా కనిపిస్తూ ఉంటది.
ఈ తరహా లోనే పంజాబ్ రాష్ట్రంలో మన్సా ప్రాంతంలో జిలేబి బాబా.. అసలు పేరు అమర్ పూరి… అలియాస్ అమరవీర్. 20 సంవత్సరాల క్రితం హర్యానాలో కుటుంబంతో తొహానాకు వచ్చాడు. తొహానా రైల్వే రోడ్డు లో జిలేబి దుకాణం పెట్టుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో భార్య చనిపోవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయి రెండేళ్ల తర్వాత మళ్లీ ఊరి చేరుకొని తనకు తాంత్రిక విద్య తెలిసింది వాళ్ళకి వీళ్ళకి చెబుతూ జిలేబి బాబాగా అవతారం ఎత్తాడు. ఆ తర్వాత తన వద్దకు వచ్చే అమాయక మహిళా భక్తులను నమ్మించి ధన లాభం కోసం ప్రత్యేక పూజలు యాగాలు చేస్తానని మాయమాటలు చెప్పేవాడు. తాంత్రిక పూజలు చేసే సమయంలో ఆత్మలు ఆవహిస్తాయని ఆ టైంలో ఏం జరుగుతుందో మీకు అసలు అర్థం కాదని… ఏం జరిగినా భరించాలంటూ మహిళలను నమ్మించి వారిని తన దారుణాలకు మానసికంగా సిద్ధం చేసేవాడు.
Haryana News court punished jalebi baba
ఇలా బాబా తన కోరికలు తీర్చుకుంటూ వస్తుండగా…పూజలంటూ ఏవో మత్తు పదార్థాలు ఇచ్చి దాదాపు 120 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల బయటపడింది. అత్యాచారం చేసే సమయంలో ప్రత్యేకంగా వీడియోలు తీసి సదరు మహిళలకు పంపి డబ్బులకి బ్లాక్మెయిల్ కూడా చేసేవాడు. ఈ క్రమంలో వీడియోలు మొత్తం బయటపడటంతో కొంతమంది మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అన్ని విషయాలు వెలుగులోకీ వచ్చాయి. దాదాపు 120 మంది మహిళలపై జిలేబి బాబా అత్యాచారం చేసిన వీడియోలు ఆశ్రమంలో దొరికాయి. ఇదే సమయంలో మత్తు పదార్థాలు సైతం అక్కడ లభించడంతో పలు సెక్షన్ల కింద జిలేబి బాబాపై కేసు నమోదు చేసి… హర్యానా కోర్టులో పోలీసులు హాజరు పరచగా… న్యాయస్థానం బాబాను దోషిగా తేల్చింది.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.