Home » Health » Idli Dosa Effects Eat In Night In Telugu
Health

Idli – Dosa : రాత్రి సమయంలో ఇడ్లీ, దోశలు తింటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే…!

Authored By
Jyothi Marikanti
The Telugu News | Updated on: January 3, 2024 8:30 pm
Advertisement

Idli – Dosa : ప్రస్తుతం మనం జీవిస్తున్న విధానం ప్రకారం కొన్ని అనారోగ్య సమస్యలు కారణంగా చాలా మంది రాత్రి సమయంలో అన్నం తినడం మానేసి చపాతీ,
ఇడ్లీ ,దోశలు తింటుఉంటారు.. అయితే రాత్రి సమయంలో వీటినీ మంచిదేనా..కదా..అని చాలా మందిలో అనుమానం ఉంటుంది..అయితే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలనీ అరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..అవి ఏంటంటే మరి వాటి గురించి తెలుసుకుందాం.. అయితే ఇడ్లీ దోశలు అంటే పులియ పెట్టిన ఫుడ్స్..ఇవి జీర్ణ శక్తికి మంచివే.. మరి వీటిని రాత్రి తీసుకోవడం మంచిదేనా.. అనేది తెలుసుకుందాం..

Advertisement

ఇడ్లీ , దోశలలో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తిని పెంచుతాయి. వీటివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. వీటిలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉంటాయి. అయితే ఉదయాన్నే తీసుకోవడం మంచిదే.. కానీ రాత్రి తీసుకోవడం అంత మంచిది కాదు. సాధారణంగా గర్భిణీలు, పాలిచ్చే వారు కూడా రాత్రులు పులియపెట్టిన ఆహారాన్ని తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో కడుపు అసౌకర్యంగా ఉంటుంది. పెరుగు, పన్నిర్ వంటి వాటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా పాలిచ్చే తల్లులు కూడా వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే తల్లికి కడుపునొప్పి వస్తే పిల్లలకి కూడా వస్తుంది.

సాధారణంగా పులియ పెట్టిన ఆహారాల్లో ఎక్కువగా ఉప్పు ఉంటుంది. అలాంటప్పుడు రక్తపోటు ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది. వీటిని తీసుకోకపోవడం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గించవచ్చు. అలాంటివారు రాత్రిపూట పులియా పెట్టిన ఇడ్లీ దోశ లాంటివి తీసుకోకపోవడమే మంచిది. ఈ ఫుడ్స్ తీసుకుంటే అజీర్ణం తలనొప్పి వంటి సమస్యలతో కూడా వారు బాధపడతారు. కొంతమందికి జీర్ణ సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా ఎస్టిటి, కడుపుబ్బరం ఉన్నవారు రాత్రులు పులియ పెట్టిన ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. దోస, ఇడ్లీ కడుపునొప్పి, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి సమయంలో దోస, ఇడ్లీలు తీసుకోకపోవడమే మంచిది.

Jyothi Marikanti

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి