YS Jagan Mohan Reddy : వైయస్సార్ హయాంలో ఆ తర్వాత వైయస్ జగన్ విషయంలో ఈనాడు పత్రిక వ్యతిరేక కథనాలతో ఎప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ పత్రిక విషయంలో ఆనాడు దివంగత వైయస్సార్ ఇప్పుడు వైఎస్ జగన్ కూడా చట్టసభలలో.. బహిరంగ సభలలో చాలాసార్లు నెగిటివ్ కామెంట్లు చేసిన సందర్బాలు ఉన్నాయ్. ఈ క్రమంలో ఈనాడు గ్రూప్ సంస్థలకు సంబంధించి మార్గదర్శి చిట్ ఫండ్ కేస్ ఎప్పటినుండో నడుస్తూ ఉన్నా గాని ఇటీవల జగన్ ప్రభుత్వం గట్టిగా ఫోకస్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మార్గదర్శి అక్రమాల
కేసులో సుప్రీంకోర్టులో అఫిడవిట్ జగన్ ప్రభుత్వం దాఖలు చేయడం జరిగింది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలపై దాడులకు దిగింది. ఈ క్రమంలో పలుచోట్ల మార్గదర్శి కార్యాలయాల మేనేజర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు కూడా పంపడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలపై పెద్ద ఎత్తున అధికారులు జరిపిన దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా చీటీల వ్యవహారం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు అందువల్లే అరెస్టులు చేయడం జరిగింది.
ఈ చిట్ ఫండ్స్ వ్యవహారంలో ఏ1గా రామోజీరావును, ఏ2గా ఆయన కోడలు శైలజను చేర్చారు. పరిస్థితి ఇలా ఉంటే మార్గదర్శి మీద జగన్ ప్రభుత్వం మరో పిడుగు పడే తరహా నిర్ణయం తీసుకుంది. మేటర్ లోకి వెళ్తే మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థల నేలకొన్న అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఆడిటింగ్ కోసం స్పెషల్ ఆడిటర్ నీ ఏపీ ప్రభుత్వం నియమించింది. సంస్థలో నిధుల మళ్లింపు మరియు అక్రమ డిపాజిట్ల సేకరణ తదితరాంశాలపై సమగ్రంగా వివరాలు రాబట్టేందుకు ఈ స్పెషల్ ఆడిటర్ నీ నియమించినట్లు సమాచారం.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.