Home » Andhra Pradesh » Mla Vidadala Rajani Gets Minister Very Soon
andhra pradesh

ఆ ఎమ్మెల్యేకి మంత్రి పదవి గ్యారెంటీ ? ఆ విషయంలో జగన్ ఫుల్ గా ఇంప్రెస్ అయ్యాడు మరి ?

Authored By
Himanshi
The Telugu News | Updated on: May 18, 2021, 5:05 pm
Advertisement

ఏపీ రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయనడంలో సందేహం లేదు. సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఎవరైతే మద్దతుగా ఆయన చెప్పినట్లుగా ఉంటారో.. ఆయన విధేయుడిగా ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వారికి అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగిస్తూ ఉంటారు. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంత్రి వర్గంలో ఉన్న వారిలో చాలా మంది కూడా ఆయనకు అత్యంత నమ్మకస్తులు. చెప్పిన పని చెప్పినట్లుగా చేసే వారు అంటూ జగన్ మోహన్ రెడ్డికి చాలా ఇష్టం అటూ గతంలో పలు సందర్బాల్లో వెళ్లడయ్యింది. త్వరలో మంత్రి వర్గ విస్తరణ అంటున్న నేపథ్యంలో ఆయన కు సన్నిహితంగా ఉన్న వారు ఎవరు ఆయన్ను మెప్పించింది ఎవరు అంటూ చాలా ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే మాత్రం ఇప్పటికే మంత్రి పదవి దక్కించుకోవడం  ఖాయం అంటూ తేలిపోయింది.

Advertisement

mla vidadala rajani gets minister very soon

అమూల్‌ విషయంలో రజినీ సూపర్‌..

పాడి పరిశ్రమకు మంచి చేయాలనే  ఉద్దేశ్యంతో గుజరాత్‌ కు చెందిన అమూల్‌ పాల ఉత్పత్తుల సంస్థను రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు. ప్రభుత్వ డైయిరీ ఉండగా అమూల్ ను ప్రోత్సహించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కాకుండా అమూల్‌ వల్ల ఏపీ రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి అనే విషయాన్ని వివరించే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించాడు. తన మాటగా ప్రతి ఒక్కరికి అమూల్‌ యొక్క ప్రాముఖ్యత చెప్పడంతో పాటు దాని వల్ల లాభాలు పొందవచ్చు అనే విషయాన్ని రైతులకు అర్థం అయ్యేలా చెప్పాలని ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచించారు. ఆ విషయంలో చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజినీ vidadala rajani మంచి మార్కులు దక్కించుకుంది.

Advertisement

మంత్రి పదవి ఖాయం.. vidadala rajani

సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమూలు విషయంలో నియోజక వర్గాల్లో ఏ ఎమ్మెల్యే ఎంతగా ప్రచారం చేశారు. ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేశారనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను ఒక సర్వేను సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్వహించారు. అందులో ప్రథమంగా చిలకలూరి పేట ఎమ్మెల్యే నిలిచారు. అందుకే ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం భావిస్తున్నారట. అంతే కాదు చిన్న వయసులోనే ఆమె చాలా మంచి పనులు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆమెకున్న పలుకుబడి మరియు పేరును గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆమెకు మంత్రి వర్గంలో చోటు ఇచ్చే విషయమై జగన్‌ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి