
mp revanth reddy open letter telangana cm kcr
Revanth Reddy : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.. దూకుడు పెంచుతున్నారు. తాజాగా ఆయన రాజీవ్ రైతు భరోసా యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటించిన రేవంత్ రెడ్డి.. రైతులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
mp revanth reddy open letter telangana cm kcr
నేను నిర్వహించిన పాదయాత్రలో రైతులు నా దృష్టికి ఎన్నో సమస్యలను తీసుకొచ్చారు. ఆ సమస్యలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి.. పరిష్కరించాలి.. అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రైతుల సమస్యలను లేఖ రూపంలో సీఎం కేసీఆర్ కు రాశారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయకూడదని.. దాన్ని అమలు చేయబోమని.. అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి ఈసందర్భంగా డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం.. రుణ మాఫీ అంటూ.. ఎరువులు ఫ్రీ అంటూ.. రైతు బంధు అంటూ రైతులను మోసం చేస్తూనే ఉన్నది. అధికారంలోకి రెండోసారి వచ్చి కూడా రుణమాఫీ గురించి ఇప్పటి వరకు అతీగతీ లేదు.. అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. రైతు బంధు డబ్బులను రుణాల వడ్డీ కింద జమ చేసుకుంటున్నాయి. వెంటనే రుణమాఫీ నిధులను విడుదల చేయాలి.. అంటూ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
2017లోనే తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఉచితంగా యూరియా అందిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ.. ఇప్పటి వరకు అది అమలు కాలేదు. అందులోనూ ప్రస్తుతం తెలంగాణలో యూరియా కొరత వేధిస్తోంది.. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే.. రైతులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వం దిగిపోక తప్పదు. మీ ఆటలు ఇక సాగవు. రైతు బంధు తొలి విడతలో కొందరికి అందాయి. మరికొందరికి రెండో విడతలో అందలేదు. అలాగే కేసీఆర్ చెప్పారని రైతులంతా సన్నాలను పండించారు. దీంతో దిగుబడి తగ్గింది.. మద్దతు ధర లేదు. సన్నాలను కొనాలని ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పుడు పంట చేతికొచ్చాక పంటను కొనే దిక్కు లేదు.. అంటూ రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
వేసవి కాలం మొదలైతే శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారాలు, పానీయాలపై అందరి దృష్టి పడుతుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్,…
Personality Fruit Test : ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఇష్టమైన పండు ఉంటుంది. కొందరికి మామిడి అంటే ప్రాణం,…
Summer Breakfast : వేసవి కాలంలో తేలికగా జీర్ణమయ్యే, ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివాహితను ప్రేమ…
This website uses cookies.