Home » Andhra Pradesh » Nara Lokesh New Story Tdp Cadre In Huge Shock
andhra pradesh

Nara Lokesh : నారా లోకేష్ కొత్త కథ.! షాక్‌లో టీడీపీ క్యాడర్.!

Authored By
aruna
The Telugu News | Published on: August 12, 2022, 1:40 pm
Advertisement

Nara Lokesh : టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయడు పుత్ర రత్నం నారా లోకేష్ చాలా పెద్ద జోక్ చేశారు. ఔను, ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమీ వుండదు. ఆ జోక్ దెబ్బకి టీడీపీ క్యాడర్‌కే మైండ్ బ్లాంక్ అయిపోయింది. ‘బాబోయ్, మా యువ నేత మరీ ఇలాంటోడా.?’ అని టీడీపీ క్యాడర్ విస్తుపోతోంది. టీడీపీ సీనియర్ నాయకులైతే, ‘నారా లోకేష్ వల్లనే పార్టీ భ్రష్టుపట్టిపోతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ అవసరం లేదు..’ అంటున్నారట. అసలేం జరిగింది.? ఇంతకీ నారా లోకేష్ పేల్చిన ఆ జోక్ ఏంటి.? ఎందుకు ఆ జోక్ ఇంత చర్చనీయాంశమయ్యింది.? ఆ జోక్ వల్ల పార్టీ క్యాడర్ ఎందుకు ఆశ్చర్యపోతోంది.? ఈ జోక్ దెబ్బకి, సీనియర్ నేతలు సైతం ఎందుకు షాక్‌కి గురయ్యారు.? అసలు విషయంలోకి వెళ్ళిపోదాం.!

Advertisement

తనకు సంతోష్ పేరుతో ఇంకో కొడుకు వున్నట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లుగా నిన్న నారా లోకేష్, మీడియాతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్.. అని అందరికీ తెలుసు. చంద్రబాబు, బాలకృష్ణల మనవడు దేవాన్ష్. నారా లోకేష్ – బ్రాహ్మణి దంపతుల ముద్దుల తనయుడు దేవాన్ష్. దేవాన్ష్ పేరుతో చంద్రబాబు అండ్ టీమ్ గతంలో చాలా హడావిడి జరిగింది. ఇంతకీ, సంతోష్ ఎక్కడినుంచి వచ్చినట్లు.? రాలేదు, రప్పించారు నారా లోకేష్. ఎవరో తన మీద ఆరోపణలు చేస్తున్నారన్నది నారా లోకేష్ వాదన. తనకు ఇంకో కొడుకు వున్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించడం సంచలనంగా మారింది. అసలు ఇలాంటి అవసరం ఎవరికైనా ఎందుకు వుంటుంది.?

Nara Lokesh New Story, TDP Cadre In Huge Shock

Advertisement

నిజంగానే నారా లోకేష్ మీద అలాంటి అనుమానాలు ఎవరైనా వ్యక్తం చేస్తే, అది మీడియాలో ఖచ్చితంగా వార్త అయి తీరుతుంది. కానీ, అలాంటి వార్త ఏదీ మీడియాలో ఇంతవరకూ కనిపించలేదు. మరెలా నారా లోకేష్, సంతోష్ అనే పేరు తెచ్చి, తన మీద దుష్ప్రచారం చేస్తున్నారని అనగలుగుతున్నారు.? ఏమోగానీ, నారా లోకేష్ మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న విమర్శ రాజకీయ ప్రత్యర్థుల నుంచి వినిపిస్తోంది.ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా చెత్త కనిపించొచ్చు. రాజకీయాల్లో వున్నవాళ్ళు అలాంటివాటిని అంత సీరియస్‌గా తీసుకోకూడదు.. ఒకవేళ అవి తమ దృష్టికి వచ్చినా, లైట్ తీసుకోవాలి. దారిన పోయే కంపని ఎక్కడో తగిలించుకున్నట్టు చేశారిప్పుడు నారా లోకేష్, ‘సంతోష్’ అనే పేరుని తెరపైకి తీసుకురావడం ద్వారా.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి