
Panchayat Elections : నువ్వు ఓటు వేయడం వల్లే ఒక్క ఓటుతో నేను ఓడిపోయాను... వృద్ధురాలి ప్రాణాలు తీసిన వేధింపులు..!
Panchayat elections : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మొనారి రాధమ్మ (61) ఇటీవల తన కుటుంబంతో కలిసి సమీపంలోని రంగాపూర్ గ్రామానికి నివాసం మార్చుకుంది. అయితే ఆమె ఓటు హక్కు మాత్రం పాత గ్రామమైన గొల్లపల్లిలోనే కొనసాగింది. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాధమ్మ గొల్లపల్లిలోనే తన ఓటు హక్కును వినియోగించింది. ఇది ఆమెకు చట్టబద్ధమైన హక్కే అయినప్పటికీ అదే ఆమె జీవితాన్ని బలితీసుకునే పరిస్థితికి దారితీసింది. గొల్లపల్లి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కలబోయిన నరేందర్ ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన ఓటమికి కారణం గ్రామం మారినా ఓటు హక్కు అక్కడే ఉంచుకున్న వారేనని భావించాడు. ఈ క్రమంలోనే రాధమ్మతో పాటు మరో ఇద్దరిపై పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
Panchayat Elections : నువ్వు ఓటు వేయడం వల్లే ఒక్క ఓటుతో నేను ఓడిపోయాను… వృద్ధురాలి ప్రాణాలు తీసిన వేధింపులు..!
సివిల్ కోర్టు నుంచి నోటీసులు అందుకున్న రాధమ్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. “నా ఒక్క ఓటుతోనే ఓడిపోయాడా?” అనే ఆలోచన ఆమెను లోపల నుండి కుదిపేసింది. ఇదిలా ఉండగా నరేందర్ సోదరుడు విజేందర్ రంగంలోకి దిగాడు. రాధమ్మ తన అన్న ఓటమికి కారణమని ఆరోపిస్తూ ఆమె కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించినట్లు తెలుస్తోంది. నీ వల్లే మా అన్న ఓడిపోయాడు మీ కుటుంబం అంతు చూస్తాం అంటూ పలుమార్లు హెచ్చరించాడని రాధమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే కోర్టు నోటీసులతో భయాందోళనలో ఉన్న వృద్ధురాలికి ఈ బెదిరింపులు తాళలేనివిగా మారాయి. సామాజికంగా పరువు పోతుందన్న భయం కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందన్న ఆందోళన ఆమెను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసింది.
నిరంతర వేధింపులు బెదిరింపులు తాళలేక రాధమ్మ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. ఒక పౌరుడి ఓటు హక్కు వినియోగం కారణంగా ఒక వృద్ధురాలి ప్రాణాలు పోవడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాధమ్మ మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేందర్ అతని సోదరుడు విజేందర్ తమ తల్లిని మానసికంగా వేధించారని బెదిరింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నరేందర్ విజేందర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువపై ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ వేధింపులపై పెద్ద చర్చకు దారి తీసింది. ఓటు వేయడం పౌరుడి హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. ఆ హక్కును వినియోగించినందుకే ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని ఆలోచింపజేసే విషాద ఘటనగా మిగిలింది.
Tipparthi : నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర రోడ్లు, భవనాలు (ఆర్ అండ్…
12 Years Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ పాలనలో 12 సంవత్సరాల మైలురాయిని…
Bharathiraja Passes Away : దక్షిణ భారత సినీ పరిశ్రమలో మరో దిగ్గజం అస్తమించింది. తమిళ చిత్రసీమకు గ్రామీణ కథల…
Viral Video : దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబాలు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నాయో చెప్పే మరో హృదయ విదారక…
Heavy Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో వర్షాల జోరు కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు…
Farmers : దేశంలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. రైతుల…
Komatireddy Venkat Reddy : నల్లగొండ జిల్లాలో Nalgonda అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర రోడ్లు,…
AP Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయాలపై…
Peddi 6 Days Box Office Collection : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ram charan హీరోగా,…
Students Good News : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం…
Gold Rate Today : బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు…
This website uses cookies.