
Panchayat Elections : నువ్వు ఓటు వేయడం వల్లే ఒక్క ఓటుతో నేను ఓడిపోయాను... వృద్ధురాలి ప్రాణాలు తీసిన వేధింపులు..!
Panchayat elections : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మొనారి రాధమ్మ (61) ఇటీవల తన కుటుంబంతో కలిసి సమీపంలోని రంగాపూర్ గ్రామానికి నివాసం మార్చుకుంది. అయితే ఆమె ఓటు హక్కు మాత్రం పాత గ్రామమైన గొల్లపల్లిలోనే కొనసాగింది. దీంతో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రాధమ్మ గొల్లపల్లిలోనే తన ఓటు హక్కును వినియోగించింది. ఇది ఆమెకు చట్టబద్ధమైన హక్కే అయినప్పటికీ అదే ఆమె జీవితాన్ని బలితీసుకునే పరిస్థితికి దారితీసింది. గొల్లపల్లి గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కలబోయిన నరేందర్ ఒక్క ఓటు తేడాతో ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన ఓటమికి కారణం గ్రామం మారినా ఓటు హక్కు అక్కడే ఉంచుకున్న వారేనని భావించాడు. ఈ క్రమంలోనే రాధమ్మతో పాటు మరో ఇద్దరిపై పెద్దపల్లి జూనియర్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
Panchayat Elections : నువ్వు ఓటు వేయడం వల్లే ఒక్క ఓటుతో నేను ఓడిపోయాను… వృద్ధురాలి ప్రాణాలు తీసిన వేధింపులు..!
సివిల్ కోర్టు నుంచి నోటీసులు అందుకున్న రాధమ్మ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. “నా ఒక్క ఓటుతోనే ఓడిపోయాడా?” అనే ఆలోచన ఆమెను లోపల నుండి కుదిపేసింది. ఇదిలా ఉండగా నరేందర్ సోదరుడు విజేందర్ రంగంలోకి దిగాడు. రాధమ్మ తన అన్న ఓటమికి కారణమని ఆరోపిస్తూ ఆమె కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించినట్లు తెలుస్తోంది. నీ వల్లే మా అన్న ఓడిపోయాడు మీ కుటుంబం అంతు చూస్తాం అంటూ పలుమార్లు హెచ్చరించాడని రాధమ్మ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే కోర్టు నోటీసులతో భయాందోళనలో ఉన్న వృద్ధురాలికి ఈ బెదిరింపులు తాళలేనివిగా మారాయి. సామాజికంగా పరువు పోతుందన్న భయం కుటుంబానికి ఏదైనా ప్రమాదం జరుగుతుందన్న ఆందోళన ఆమెను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసింది.
నిరంతర వేధింపులు బెదిరింపులు తాళలేక రాధమ్మ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఎస్సారెస్పీ కాలువలో దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గ్రామాల్లో తీవ్ర కలకలం రేపింది. ఒక పౌరుడి ఓటు హక్కు వినియోగం కారణంగా ఒక వృద్ధురాలి ప్రాణాలు పోవడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రాధమ్మ మృతదేహాన్ని వెలికితీసిన అనంతరం ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నరేందర్ అతని సోదరుడు విజేందర్ తమ తల్లిని మానసికంగా వేధించారని బెదిరింపుల వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నరేందర్ విజేందర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువపై ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ వేధింపులపై పెద్ద చర్చకు దారి తీసింది. ఓటు వేయడం పౌరుడి హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. ఆ హక్కును వినియోగించినందుకే ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని ఆలోచింపజేసే విషాద ఘటనగా మిగిలింది.
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
Rain Alert : ఏప్రిల్ నెల అంటే సాధారణంగా మండే ఎండలు, వడగాల్పులు గుర్తుకు వస్తాయి. అయితే ఈసారి తెలుగు…
Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి…
హైదరాబాద్ : వేల వేల భక్త జనుల జయ జయ ధ్వానాల మధ్య హైదరాబాద్ మైహోమ్ అవతార్ గ్రౌండ్స్లో జరిగిన…
Jabardasth : తెలుగు కామెడీ షోలలో ప్రత్యేక గుర్తింపు పొందిన జబర్దస్త్ లో యాంకర్గా సౌమ్య రావు ఎంట్రీ ఇచ్చిన…
Brass vs Aluminum : చాలా కాలంగా మన వంటగదుల్లో అల్యూమినియం పాత్రలు ప్రధాన స్థానాన్ని సంపాదించుకున్నాయి. తేలికగా ఉండటం…
Orenges : నారింజ పండ్ల గురించి తెలియని వారు చాలా అరుదు. పుల్లగా, తియ్యగా రుచిచూపే ఈ పండ్లు ఆరోగ్యానికి…
Sanju Samson : ముంబై ఇండియన్స్తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్లో సంజు సామ్సన్ అద్భుతమైన ఫామ్లోఉన్నాడు. తను కేవలం 54…
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
This website uses cookies.