Pawan kalyan : దయచేసి వాళ్ళతో పోల్చకండి వైయస్సార్ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు…!!
Pawan kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఏపీలో విజయవాడ ఇంద్రకీలాద్రిలో.. “వారాహి” వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎస్టి, ఎస్సి సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు పై చర్చ గోష్టీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్యనేతలతో పాటు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ప్రముఖులు మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…దివంగత వైయస్సార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ మాట్లాడుతూ…‘‘ బ్రిడ్జి దాటగానే ఆత్మకూరు గ్రామ పంచాయతీ దగ్గర హైవేనుంచి వస్తూ ఉన్నా.. చూస్తే.. జ్యోతీ బా పూలే, డాక్టర్ వైఎస్సార్ ముఖ ద్వారం అని రాసి ఉంది. వైఎస్సార్ గారు గొప్ప వారే నేను కాదనను. ఆయన చేశారు. ఆయనకు అనుభవం ఉంది. కానీ, ఆయనకు జ్యోతీ బా పూలేతో పోలిక కాదు. బాబా సాహేబ్ అంబేద్కర్తో పోలిక కాదు. నారాయణ గురులతో పోలిక కాదు. సాహూ మహరాజ్తో పోలీక కాదు.
pawan kalyan comments ys rajasekhar reddy
ఈయన అర్థం చేసుకోవాలి. ఎక్కడో ఓ చోట చిన్నదే అయి ఉండొచ్చు. జ్యోతి బా పూలే, వైఎస్సార్ పేరు చిన్నదే అయి ఉండొచ్చు. చూసే వాళ్లకు అది తట్టక పోవచ్చు. కానీ, నేను ఏం ఆలోచిస్తానంటే.. దాని వెనుక నీ ముఖ్య ఉద్ధేశ్యం చెప్పు. అంటే నువ్వు పూర్తి మర్యాద ఇవ్వవు. పేర్లు మధ్యలోకి వచ్చేస్తాయి. మేము అనుకుంటున్నది.. జ్యోతీ బా పూలే గారిది అంటే.. జ్యోతి బా పూలే గారిదే.. ఎవరిదీ ఉండకూడదు. గౌరవం ఇస్తే.. సంపూర్ణ గౌరవం ఇవ్వు. ఆదా, ఆదా గౌరవాలు ఇవ్వకు’’ అని పవన్ వ్యాఖ్యానించారు.
