Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

 Authored By sandeep | The Telugu News | Updated on :10 September 2025,2:00 pm

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

#image_title

డిప్యూటీ సీఎం ఫొటో వద్దన్న నిషేధం ఎక్కడ ఉంది?

వాదనలు పరిశీలించిన కోర్టు, “డిప్యూటీ సీఎం ఫొటో ఏర్పాటు చేయకూడదన్న నిషేధం ఎక్కడ ఉంది?” అని ప్రశ్నించింది. ఇటువంటి అంశాలను రాజకీయ దృష్టితో కోర్టుల ముందుకు తీసుకురావడం సరైంది కాదని స్పష్టం చేసింది. ఈ కేసు రాజకీయ ప్రయోజనాల కోసమే దాఖలైందని ధర్మాసనం అభిప్రాయపడింది.

ప్రజా ప్రయోజనాల పిలుపుతో దాఖలు చేసిన పిటిషన్ అయినప్పటికీ, దీని వెనుక ఉన్న ఉద్దేశం నిజమైన పబ్లిక్ ఇంటరెస్ట్‌ కాదని కోర్టు స్పష్టంచేసింది.ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (PILs) సామాజికంగా ప్రయోజనం కలిగించే అంశాలపై ఉండాలి. రాజకీయ కక్షలు, ఉద్దేశాలతో కోర్టులను వేదికగా మార్చే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి హానికరం.అలానే, ప్రజల తరపున కోర్టును ఆశ్రయించాలంటే, చట్టబద్ధంగా, సత్యంతో కూడిన అంశాలు మాత్రమే వినిపించాలన్నదే కోర్టు సందేశం.

Tags :

    sandeep

    No bio available for this author.

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి