#image_title
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని తేలింది. దేశంలో రామెన్ వినియోగం అత్యధికంగా ఉన్న యమగటా ప్రాంతంలో 40 ఏళ్లు పైబడిన 6,725 మందిని దాదాపు 4.5 సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు.
#image_title
పరిశోధనలో ముఖ్యాంశాలు:
* వారానికి మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ రామెన్ తినేవారి మరణ ప్రమాదం, వారానికి ఒకటి లేదా రెండుసార్లు తినేవారి కంటే 1.52 రెట్లు ఎక్కువ గా ఉంది.
* రసం సగానికి పైగా తాగినవారిలో ప్రమాదం మరింత అధికంగా ఉంది.
* 70 ఏళ్లలోపు పురుషులు ప్రధానంగా ప్రభావితమయ్యారని గుర్తించారు.
* మద్యం క్రమం తప్పకుండా సేవించే వారిలో మరణ ప్రమాదం దాదాపు మూడు రెట్లు పెరిగిందని అధ్యయనం చెబుతోంది.
* వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే రామెన్ తిన్న సమూహంలో అత్యల్ప మరణాల రేటు నమోదైంది.
రామెన్ ఎందుకు ప్రమాదకరం?
రామెన్ రసం ఎక్కువగా ఉప్పుగా ఉంటుంది. దానిని పూర్తిగా తాగితే శరీరంలో సోడియం స్థాయి పెరిగి అధిక రక్తపోటు, స్ట్రోక్, కడుపు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ అధ్యయనంలో భాగమైన యోనెజావా యూనివర్శిటీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ సైన్స్ కి చెందిన డాక్టర్ మిహో సుజుకి మాట్లాడుతూ, రసం పూర్తిగా తాగకుండా ఉండాలి. ఆహారంలో కూరగాయలను జోడించి పోషక విలువలను సమతుల్యం చేయాలి అని సూచించారు.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
This website uses cookies.