Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Authored By Sam C | The Telugu News | Updated on : 27 September 2025, 10:00 am

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని తేలింది. దేశంలో రామెన్ వినియోగం అత్యధికంగా ఉన్న యమగటా ప్రాంతంలో 40 ఏళ్లు పైబడిన 6,725 మందిని దాదాపు 4.5 సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు.

#image_title

పరిశోధనలో ముఖ్యాంశాలు:

* వారానికి మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ రామెన్ తినేవారి మరణ ప్రమాదం, వారానికి ఒకటి లేదా రెండుసార్లు తినేవారి కంటే 1.52 రెట్లు ఎక్కువ గా ఉంది.
* రసం సగానికి పైగా తాగినవారిలో ప్రమాదం మరింత అధికంగా ఉంది.
* 70 ఏళ్లలోపు పురుషులు ప్రధానంగా ప్రభావితమయ్యారని గుర్తించారు.
* మద్యం క్రమం తప్పకుండా సేవించే వారిలో మరణ ప్రమాదం దాదాపు మూడు రెట్లు పెరిగిందని అధ్యయనం చెబుతోంది.
* వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే రామెన్ తిన్న సమూహంలో అత్యల్ప మరణాల రేటు నమోదైంది.

రామెన్ ఎందుకు ప్రమాదకరం?

రామెన్ రసం ఎక్కువగా ఉప్పుగా ఉంటుంది. దానిని పూర్తిగా తాగితే శరీరంలో సోడియం స్థాయి పెరిగి అధిక రక్తపోటు, స్ట్రోక్, క‌డుపు క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ అధ్యయనంలో భాగమైన యోనెజావా యూనివర్శిటీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ సైన్స్ కి చెందిన డాక్టర్ మిహో సుజుకి మాట్లాడుతూ, రసం పూర్తిగా తాగకుండా ఉండాలి. ఆహారంలో కూరగాయలను జోడించి పోషక విలువలను సమతుల్యం చేయాలి అని సూచించారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp