Categories: NationalNews

Grain ATM : వచ్చేస్తున్నాయి ‘రైస్ ఏటీఎంలు’.. కార్డు పెడితే చాలు, కిలోల కొద్దీ బియ్యం మీ చేతికి..!

Advertisement
Published by
Advertisement

Grain ATM : సాధారణంగా ఏటీఎం ( ATM ) అనగానే మనకు గుర్తొచ్చేది డబ్బులు. కార్డు పెట్టి కావాల్సినంత క్యాష్ తీసుకుంటాం. కానీ, ఇకపై ఏటీఎం అంటే కేవలం డబ్బులే కాదు.. బియ్యం, గోధుమలు కూడా గుర్తుకు రాబోతున్నాయి. అవును, మీరు విన్నది నిజమే! కార్డు పెడితే చాలు.. మనకు కావాల్సిన రేషన్ బియ్యం, గోధుమలు టపటపా బయటకు వచ్చే ‘గ్రెయిన్ ఏటీఎంలు’ (Grain ATMs) వచ్చేస్తున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ( PDS )లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.

Advertisement

Grain ATMs : వచ్చేస్తున్నాయి ‘రైస్ ఏటీఎంలు’.. కార్డు పెడితే చాలు, కిలోల కొద్దీ బియ్యం మీ చేతికి..!

Grain ATM : ఎక్కడ మొదలవుతున్నాయి?

కేంద్ర ప్రభుత్వ పైలట్ ప్రాజెక్ట్ కింద బీహార్ ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాజధాని పాట్నాలో మూడు చోట్ల ఈ ధాన్యం ఏటీఎంలను ఏర్పాటు చేయడానికి అనుమతులు మంజూరు చేసింది. వాస్తవానికి, దేశంలోనే మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎంను 2024 ఆగస్టులోనే ఒడిశాలోని భువనేశ్వర్‌లో ప్రారంభించారు. ఇప్పుడు దీనిని ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తున్నారు.

Advertisement

Grain ATM : ఏంటీ గ్రెయిన్ ఏటీఎం? ఎలా పనిచేస్తుంది?

ఇది అచ్చం మనం డబ్బులు తీసుకునే ఏటీఎం లాంటిదే. కానీ ఇందులో నోట్లకు బదులు ధాన్యం వస్తుంది. జాతీయ ఆహార భద్రతా కార్యక్రమం కింద లబ్ధిదారులకు బియ్యం, గోధుమలను పంపిణీ చేయడానికి ఈ ఆటోమేటెడ్ యంత్రాన్ని రూపొందించారు. రేషన్ కార్డు లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు వివరాలను నమోదు చేసి, బయోమెట్రిక్ ద్వారా తమ ఐడెంటిటీని నిర్ధారించుకోవాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, తమకు ఏ ధాన్యం కావాలి (బియ్యం, గోధుమలు), ఎంత పరిమాణం కావాలి అనేది స్క్రీన్ పై ఎంచుకోవాలి. క్షణాల్లోనే ఆ మెషిన్ కింద ఉన్న బకెట్ లేదంటే సంచిలోకి ధాన్యాన్ని నింపుతుంది. ఈ లావాదేవీ వెంటనే ఆన్ లైన్ లో నమోదవుతుంది.

కేవలం 5 నిమిషాల్లో 50 కిలోలు

ఈ ఏటీఎం పనితీరు చాలా వేగంగా ఉంటుంది. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే దాదాపు 50 కిలోల వరకు ధాన్యాన్ని ఇది పంపిణీ చేయగలదు. అంతేకాదు, ఇది విద్యుత్ ఆదాలోనూ మేటి. గంటకు కేవలం 0.6 వాట్ల విద్యుత్ మాత్రమే దీనికి అవసరమవుతుంది. సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్ల సాయంతో కూడా దీనిని నడపవచ్చు.

ఎందుకు తీసుకొస్తున్నారు?

రేషన్ షాపుల్లో తూకం విషయంలో మోసాలు జరుగుతున్నాయని, అర్హులకు సక్రమంగా సరుకులు అందడం లేదని తరచుగా ఫిర్యాదులు వస్తుంటాయి. అలాగే రేషన్ డీలర్ల దగ్గర గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికే ఈ ‘గ్రెయిన్ ఏటీఎం’లను తీసుకొస్తున్నారు. దీనివల్ల రేషన్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని, లబ్ధిదారులకు కచ్చితమైన తూకంతో సరుకులు అందుతాయని అధికారులు భావిస్తున్నారు.ప్రస్తుతం పాట్నాలో పైలట్ ప్రాజెక్టుగా రెండు, మూడు నెలల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. అక్కడ విజయవంతమైతే.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ రైస్ ఏటీఎంలు దర్శనమిచ్చే అవకాశం ఉంది.

Advertisement
Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Recent Posts

Ustaad Bhagat Singh Movie Review : ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్..!

Ustaad Bhagat Singh Movie Review : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ Pawan Kalyan , మాస్ డైరెక్టర్…

1 hour ago

Hyderabad Girls : ఆ అమ్మాయిలని నమ్మకండిరా బాబు .. హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

Hyderabad Girls : ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు లోకం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్టే…

2 hours ago

Ustaad Bhagath singh : ఉస్తాద్ కొంచెం మంచి టాక్ వస్తే చాలు .. హరీష్ శంకర్ కి బంపర్ ఆఫర్ రెడీ గా ఉంది

Ustaad Bhagath singh :టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం ఒక రకమైన క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడనే చెప్పాలి.…

3 hours ago

Malkajgiri : మల్కాజ్‌గిరి కార్పొరేషన్‌లో ఘనంగా రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం

Malkajgiri : మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున “రంజాన్…

4 hours ago

Iran And India : 22 ఓడలు వదిలేస్తాం కానీ ఈ సాయం చేయండి , భారత్ తో కాళ్ళ బేరానికి ఇరాన్

Iran And India : ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవలు ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని వణికించేలా ఉన్నాయి.…

4 hours ago

Telangana : బీసీలపై అవమానకర వ్యాఖ్యలు .. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలి ..!

Telangana : తెలంగాణలో బీసీలపై అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీ…

5 hours ago

Revanth Reddy : చంద్రబాబు కి రేవంత్ తెలంగాణా ని తాకట్టు పెట్టారా?

Revanth Reddy : క్వింటల్ కొద్దీ ఆరోపణలు, టన్నుల కొద్దీ విమర్శలు.. ప్రస్తుతం తెలంగాణ Telangana రాజకీయాల్లో Harish rao …

6 hours ago

Pawan Kalyan : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఎంతిచ్చారో తెలుసా ?

Pawan Kalyan : సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది పండగ…

8 hours ago

Rithu Bharosa : రైతు భరోసా అమలు పై ప్రభుత్వం కీలక నిర్ణయం .. వారికి మాత్రమే పెట్టుబడి సాయం ..!

Rithu Bharosa : యాసంగి సీజన్‌లో రైతులకు పెట్టుబడి సాయం నిరాటంకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.…

9 hours ago

Induction stove : ఇండక్షన్ స్టౌవ్‌లకు పెరుగుతున్న డిమాండ్ .. రూ. 2000 లోపు దొరికే బెస్ట్ ఇండక్షన్ స్టవ్‌లు ఇవే ..!

Induction stove : ప్రస్తుతం ఎక్కువ మంది గ్యాస్ స్టౌవ్‌లకు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ కుక్‌టాప్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.…

11 hours ago

Farmers : రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ .. రూ. 5 లక్షలు పెంపు ..!

Farmers : రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని…

12 hours ago

Gold Silver Price 18th March 2026 : పండుగ ముందు కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Silver Price 18th March 2026 : పండుగ సీజన్ వస్తుందంటే చాలు, తెలుగు లోగిళ్లలో పసిడి కొనుగోళ్లు…

14 hours ago