
Rohit Sharma : గెలిచాక పిచ్పై మట్టి తిన్న రోహిత్ శర్మ.. అందుకు కారణం ఏంటో రివీల్ చేశాడు
Rohit Sharma : టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో రోహిత్ శర్మ చాలా ఆనందంలో ఉన్నారు. తన కెప్టెన్సీలో టీమిండియాకి కప్ రావడంతో ఉబ్బితబ్బిబవుతున్నాడు. గతేడాది మిస్సయిన వన్డే వరల్డ్ కప్ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ రూపంలో అందడంతో చాలా ఎమోషనల్ అయ్యాడు. కపిల్ దేవ్, ధోనీ తర్వాత ఇండియాకు వరల్డ్ కప్ అందించిన మూడో కెప్టెన్ రోహిత్ శర్మ కావడం విశేషం. అయితే కప్ గెలిచిన రోజు తాను అసలు నిద్ర పోలేదని చెప్పాడు. “అదంతా కలగానే ఉంది. ఆ సమయంలో కలిగిన ఫీలింగ్ అదే. ఎన్నో ఏళ్లుగా దీని గురించి కల కన్నాము. ఓ జట్టుగా చాలా కష్టపడ్డాం. మొత్తానికి దానిని సాధించాం. కష్టపడి సాధించిన తర్వాత కలిగే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ రాత్రి అసలు పడుకోనేలేదు. అయినా నాకేమీ అనిపించడం లేదు. ఇంటికెళ్లిన తర్వాత అదే పని చేస్తాను” అని రోహిత్ అన్నాడు.
17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్, 13 ఏళ్ల తర్వాత ఓ క్రికెట్ వరల్డ్ కప్, 11 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీని టీమిండియాకు అందించిన రోహిత్ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయాడు. అయితే గెలిచిన వెంటనే రోహిత్ పిచ్ వద్దకు వెళ్లి మట్టి తిన్నాడు. దానిపై ఓ వీడియోలో వివరణ ఇచ్చాడు. మంచి విజయాన్ని అందించిన పిచ్ను తనలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే మట్టిని తిన్నానని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆ పిచ్పై గెలిచాం కాబట్టి అది మాకు ఎంతో ప్రత్యేకం. ఈ విజయంతో పాటు మైదానాన్ని, పిచ్ను జీవితాంతం గుర్తుంచుకుంటా. పిచ్ను నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మట్టిని నా నోట్లో వేసుకున్నాను. ఈ గెలుపు క్షణాలు చాలా ప్రత్యేకమైనవి అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
Rohit Sharma : గెలిచాక పిచ్పై మట్టి తిన్న రోహిత్ శర్మ.. అందుకు కారణం ఏంటో రివీల్ చేశాడు
టీ20 వరల్డ్ కప్ గెలవడం ఇప్పటికీ తనకు కలగానే ఉందని, అసలు అలా జరగలేదేమో అనిపిస్తోందని రోహిత్ ఈ వీడియోలో అనడం విశేషం. “గెలిచిన తర్వాత క్షణాలను నేను మాటల్లో వర్ణించలేను. ఏదీ ముందుగా అనుకొని చేసింది కాదు. అప్పటికప్పుడు అలా చేస్తూ వెళ్లిందే. ఈ ఫీలింగ్ చాలా అద్భుతం..ఓ జట్టుగా చాలా కష్టపడ్డాం. మొత్తానికి దానిని సాధించాం. కష్టపడి సాధించిన తర్వాత కలిగే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ రాత్రి అసలు పడుకోనేలేదు. అయినా నాకేమీ అనిపించడం లేదు. ఇంటికెళ్లిన తర్వాత అదే పని చేస్తాను” అని రోహిత్ అన్నాడు. ఇక ఇటీవల రోహిత్ శర్మ టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో నమ్మకానికి మారుపేరుగా ఉన్న విజయ డైరీ ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు కొత్త…
Tirumala : తిరుమల శ్రీవారి కి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల విషయంలో ఒక సంచలనమైన దొంగతనం వెలుగులోకి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్న…
TKGKS - KANA - Khammam : ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ…
Revanth Reddy : హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన వినోద కేంద్రానికి వేదిక కాబోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…
Sardar Papanna statue : తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప వీరుల్లో సర్దార్ సర్వాయి పాపన్న…
IPL 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన…
HPCL Recruitment 2026 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ…
Central Govt : దేశంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఇంధనాల కృతిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
PM Shram Yogi Mandhan Yojana : దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన…
Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై యాంకర్గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించిన రష్మి గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో…
Samsung Galaxy S25 FE 5G : శాంసంగ్ స్మార్ట్ఫోన్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే శుభవార్త అందించింది. 'అమెజాన్ ఎలక్ట్రానిక్స్…
This website uses cookies.