కరోనా బారిన పడి కోలుకున్న వారిలో చాలా మందికి బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి వస్తోంది. ప్రస్తుతం దేశంలో అనేక రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ విషయం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే బ్లాక్ ఫంగస్ బాధితులకు ప్రభుత్వాలు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నాయి. అయితే కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ బ్లాక్ ఫంగస్ వచ్చిన వారికి పలు ఆయుర్వేద ఔషధాలను తీసుకోవాలని సూచిస్తోంది. దీంతో బ్లాక్ ఫంగస్ తగ్గుముఖం పడుతుంది. వీటిని రోజూ భోజనం చేసిన తరువాత తీసుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది.
బ్లాక్ ఫంగస్ ఉన్నవారు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించిన మేర 3 రకాల ఔషధాలను వాడాల్సి ఉంటుంది. అవి…
1. సంశమనవటి (500ఎంజీ) – ఉదయం, రాత్రి భోజనం తరువాత ఒక్కో ట్యాబ్లెట్ చొప్పున తీసుకోవాలి.
2. నిశామలకివటి (500ఎంజీ) – ఉదయం, రాత్రి భోజనం అనంతరం ఒక్కో ట్యాబ్లెట్ ను తీసుకోవాలి.
3. సుదర్శనఘనవటి (500ఎంజీ) – ఉదయం భోజనం తరువాత 1, రాత్రి భోజనం తరువాత 2 ట్యాబ్లెట్లను తీసుకోవాలి.
ఈ ట్యాబ్లెట్లను బ్లాక్ ఫంగస్ ఉన్నవారు వాడితే త్వరగా ఆ వ్యాధి నుంచి బయట పడవచ్చు. ఇక ఈ వ్యాధి ఉన్నవారు రోజూ గోరు వెచ్చని నీటిని తాగాలి. ఆహారం వేడిగా ఉండగానే భోజనం చేయాలి. తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి.
దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, జామ, ఖర్జూర పండ్లను తినాలి. ఇంట్లోనూ, బయటకు వెళ్లినప్పుడు మాస్కులను ధరించాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి. రోజుకు 2 సార్లు ఆవిరి పట్టాలి. రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. నియంత్రణలో లేకపోతే వైద్యుల సూచన మేరకు మందులను వాడుకోవాలి.
బ్లాక్ ఫంగస్ ఉన్నవారు చల్లని పదార్థాలు, శీతల పానీయాలు, ఫ్రిజ్లో నిల్వ ఉంచిన ఆహారాలను తినరాదు. బేకరీ ఫుడ్ను తీసుకోరాదు. చల్లని గాలి (ఏసీ, కూలర్)లో ఉండరాదు. పెరుగు తినకూడదు.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.