
TDP
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. గుంటూరు జిల్లాకు చెందిన దివంగత నాయకుడు, లాల్ జాన్ బాషా సోదరుడు.. జియావుద్దీన్ సైకిల్ దిగేశారు. ఆయన నేరుగా వైసీపీలోకి చేరిపోయారు. సుదీర్ఘకాలంగా మైనార్టీ వర్గాన్ని టీడీపీ వెంట నడిపించిన కుటుంబంగా బాషాలకు పేరుంది. లాల్జాన్-జియావుద్దీన్లు ఇద్దరూ కూడా టీడీపీని ఒకప్పుడు గుంటూరులో అభివృద్ది బాట పట్టించారనే పేరు తెచ్చుకున్నారు. పైగా చంద్రబాబుకు అత్యంత నమ్మకంగా మెలిగారు. ఈ క్రమంలోనే జియావుద్దీన్ 1994, 1999లో గుంటూరు 1 నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం దక్కించుకున్నారు. ఇక, 2004, 2009లో ఆయన ఓడిపోయినా.. పార్టీ వెంటే నడిచారు. ఈ క్రమంలోనే 2014, 2019లో టికెట్ ఇవ్వకపోయినా.. పార్టీ కోసం పనిచేశారు. ఇక, అతికష్టమ్మీద అన్నట్టుగా 2017లో చంద్రబాబు ఆయనకు మైనార్టీ కమిషన్ చైర్మన్గా నామినేటెడ్ పదవి ఇచ్చారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో అయినా.. తనకు టికెట్ ఇవ్వాలని జియావుద్దీన్ పట్టుబడుతున్నారు. దీనిపై చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందనా లేకపోగా.. పార్టీ పరంగా ఈ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా వ్యూహాత్మకంగా .. టీడీపీని బలహీన పరిచే చర్యలకు పూనుకున్నారు.
tdp guntur leader jiyavuddin resigns tdp party
తాజాగా జియా వుద్దీన్.. వైసీపీలోకి చేరడంతో మైనార్టీ వర్గాన్ని టీడీపీకి దూరం చేస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి మైనార్టీలు ఆ పార్టీ వెంటే ఉంటూ వస్తున్నారు. దీనిని తమవైపు తిప్పుకొనేందుకు టీడీపీ ఇప్పటికే అనేక రూపాల్లో ప్రయత్నించింది. అయితే.. బలమైన నాయకులను బలోపేతం చేయడంలో చంద్రబాబు విఫలం కావడం.. మైనార్టీ కమిషన్ ఖాళీగా ఉన్నప్పటికీ.. పార్టీ అధికారం కోల్పోవడానికి రెండేళ్లముందు ఈ పదవిని ఇవ్వడం.. పైగా లాల్ జాన్ బాషా వంటి నేతల కుటుంబాలకు కూడా ప్రాధాన్యం లేకపోవడం వంటి పరిణామాలు టీడీపీకి మైనార్టీ వర్గాలను దూరం చేసేశాయి. ఇదిలా ఉంటే, 2014లో టీడీపీ తరఫున ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా గెలవలేదు. గత ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి. మరి ఇలాగే కొనసాగితే.. మున్ముందు.. 15 శాతం గా ఉన్న ముస్లింలు.. 5 శాతంగా ఉన్న వారి ఓటు బ్యాంకు టీడీపీకి దూరం కావడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిపై చంద్రబాబు ఏం చేస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది.
BRS Party : మిర్యాలగూడ miryalaguda పట్టణం సీతారాంపురం (42వ వార్డు) మాజీ కౌన్సిలర్ చిదెళ్ళ సత్యవేణి – వెంకటేశ్వర్లు…
Corporator Venkatesh Goud : 124 అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారి లోని ఇందిరాగాంధీ స్టేట్యూ…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్, 9వ డివిజన్ మేడిపల్లిలోని సుమా రెసిడెన్సీ హౌస్ ఓనర్స్ వెల్ఫేర్…
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేట్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9 వ డివిజన్ మేడిపల్లి ధరణి కాలనీ అసోసియేషన్ ఎన్నికలు…
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ central government వాటా ఖరారయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి.…
Vivo V23 Max Review : స్మార్ట్ఫోన్ SmartPhone మార్కెట్లో స్టైలిష్ డిజైన్స్, అద్భుతమైన కెమెరాలకు పెట్టింది పేరు వివో…
Gas Cylinder : ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ అంటే మన కళ్లముందు ఒకే చిత్రం కనిపించేది. ఎరుపు రంగులో ఇనుముతో…
AP 2029 Elections : ఏపీ రాజకీయ ముఖచిత్రం 2029 ఎన్నికల నాటికి సమూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం…
This website uses cookies.