
chandrababu
TDP చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత. అలాంటి చంద్రబాబు ఈసారి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తన పార్టీ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి వత్తాసు పలికినా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. కనీసం వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటీషన్ ను కూడా చంద్రబాబు పార్టీ అధినేతగా స్పీకర్ కు ఇవ్వలేకపోయారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ TDP దారుణ ఓటమిని చవిచూసింది. 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ TDPచరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఓటమి. ఈ ఓటమిని జీర్ణించుకుని నిలదొక్కుకుందామనుకునే లోపే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. వారు పార్టీకి రాజీనామా చేయకుండానే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీ TDP పై విమర్శలు చేస్తున్నారు.
chandrababu
వదిలేయడంపై కేడర్ గుస్సా.. TDP
టీడీపీ TDP ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లు పార్టీని వీడారు. నలుగురు వైఎస్ జగన్ ను కలసి కండువా కప్పుకోకపోయినా, ఆ పార్టీకి మద్దతుదారులుగా మారారు. ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకూ చంద్రబాబు స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇవ్వలేదు. వారిని చూసీ చూడనట్లు వదిలేశారు. ఇది పార్టీ క్యాడర్ లో ఇబ్బందిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎటూ ఈ నలుగురు టీడీపీ నుంచి పోటీ చేయరు. చీరాల, గన్నవరం, గంటూరు పశ్చిమ, విశాఖ సౌత్ నియోజకవర్గాల నుంచి టీడీపీ TDP తరుపున కొత్త వారిని పోటీకి దింపాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో వీరి పట్ల చంద్రబాబు మెతక వైఖరిని ఎందుకు అవలంబిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదని చంద్రబాబు యోచిస్తున్నారు. అయినప్పటికీ ఒక పార్టీ అధినేతగా పార్టీ నియమావళిని థిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు.
TDP
బహిష్కరించినా .. చాలని .. TDP
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ అనర్హత పిటీషన్ స్పీకర్ కు ఇచ్చిన విషయాన్ని కేడర్ ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. వైసీపీ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజును బహిష్కరించలేదు. కానీ చంద్రబాబు ఈ నలుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తే, వైఎస్.జగన్ ను ఇరకాటంలోకి నెట్టే వీలుందని వీరంతా చెబుతున్నారు. అయితే చంద్రబాబు దానిని కూడా వినిగించుకోలేకపోతున్నారన్న టాక్ పార్టీలోనే విన్పిస్తుంది. అదే ఎందుకన్న చర్చ కేడర్ లో గట్టిగానే సాగుతోంది. ఈ నలుగురు పార్టీకి చేయందించడంతో, ఆ ప్రాంతాల్లో కేడర్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. వీరిపై కనీసం బహిష్కార ముద్ర కూడా వేయలేకపోయారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండడంతో, కనీసం చంద్రబాబు ఆపనైనా చేయాలని వీరంతా కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంపై కనీసంగా కూడా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Ajit Doval : ప్రస్తుత ప్రపంచ రాజకీయాల్లో భారత్ మరియు రష్యా మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.…
Trisha : దక్షిణాది చిత్రసీమతో పాటు జాతీయ మీడియా, సోషల్ మీడియాలో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ పేరు ఇటీవలి…
Police Academy : దేశంలోని ప్రముఖ పోలీస్ శిక్షణ సంస్థల్లో ఒకటైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ…
kashmir Modi : భారతదేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత సవాళ్లలో నక్సలిజం మరియు జమ్మూ కాశ్మీర్ సమస్యలు దశాబ్దాలుగా మానిపోని…
Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా…
Jobs : ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది చాలా మంది యువతకు పెద్ద లక్ష్యంగా మారింది. ముఖ్యంగా…
Revanth Reddy : తెలంగాణ Telangana రాష్ట్ర ముఖ్యమంత్రి CM Revanth Reddy రేవంత్ రెడ్డి Adilabad ఆదిలాబాద్ జిల్లా…
Borugadda Anil : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నాళ్లుగా పెను సంచలనం రేపుతున్న రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు ఇప్పుడు…
Gold Silver Rate April 7th 2026 : భారతీయ సంస్కృతిలో, సంప్రదాయాలలో బంగారానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా…
Karthika Deepam 2 April 7th 2026 Today Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ, ప్రతిరోజూ సరికొత్త…
Dinner : చాలామంది రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేసి వెంటనే నిద్రపోతుంటారు కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో హానికరమని…
Summer Diabetics : ఎండలు Summer మండిపోతున్న వేళ సాధారణ వ్యక్తుల కంటే మధుమేహం లేదా షుగర్ Diabetics వ్యాధితో…
This website uses cookies.