
chandrababu
TDP చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత. అలాంటి చంద్రబాబు ఈసారి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తన పార్టీ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి వత్తాసు పలికినా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. కనీసం వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటీషన్ ను కూడా చంద్రబాబు పార్టీ అధినేతగా స్పీకర్ కు ఇవ్వలేకపోయారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ TDP దారుణ ఓటమిని చవిచూసింది. 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ TDPచరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఓటమి. ఈ ఓటమిని జీర్ణించుకుని నిలదొక్కుకుందామనుకునే లోపే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. వారు పార్టీకి రాజీనామా చేయకుండానే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీ TDP పై విమర్శలు చేస్తున్నారు.
chandrababu
వదిలేయడంపై కేడర్ గుస్సా.. TDP
టీడీపీ TDP ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లు పార్టీని వీడారు. నలుగురు వైఎస్ జగన్ ను కలసి కండువా కప్పుకోకపోయినా, ఆ పార్టీకి మద్దతుదారులుగా మారారు. ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకూ చంద్రబాబు స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇవ్వలేదు. వారిని చూసీ చూడనట్లు వదిలేశారు. ఇది పార్టీ క్యాడర్ లో ఇబ్బందిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎటూ ఈ నలుగురు టీడీపీ నుంచి పోటీ చేయరు. చీరాల, గన్నవరం, గంటూరు పశ్చిమ, విశాఖ సౌత్ నియోజకవర్గాల నుంచి టీడీపీ TDP తరుపున కొత్త వారిని పోటీకి దింపాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో వీరి పట్ల చంద్రబాబు మెతక వైఖరిని ఎందుకు అవలంబిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదని చంద్రబాబు యోచిస్తున్నారు. అయినప్పటికీ ఒక పార్టీ అధినేతగా పార్టీ నియమావళిని థిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు.
TDP
బహిష్కరించినా .. చాలని .. TDP
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ అనర్హత పిటీషన్ స్పీకర్ కు ఇచ్చిన విషయాన్ని కేడర్ ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. వైసీపీ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజును బహిష్కరించలేదు. కానీ చంద్రబాబు ఈ నలుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తే, వైఎస్.జగన్ ను ఇరకాటంలోకి నెట్టే వీలుందని వీరంతా చెబుతున్నారు. అయితే చంద్రబాబు దానిని కూడా వినిగించుకోలేకపోతున్నారన్న టాక్ పార్టీలోనే విన్పిస్తుంది. అదే ఎందుకన్న చర్చ కేడర్ లో గట్టిగానే సాగుతోంది. ఈ నలుగురు పార్టీకి చేయందించడంతో, ఆ ప్రాంతాల్లో కేడర్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. వీరిపై కనీసం బహిష్కార ముద్ర కూడా వేయలేకపోయారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండడంతో, కనీసం చంద్రబాబు ఆపనైనా చేయాలని వీరంతా కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంపై కనీసంగా కూడా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
This website uses cookies.