
chandrababu
TDP చంద్రబాబు నాయుడు తెలుగు రాజకీయాల్లో 40 ఏళ్ల రాజకీయ అనుభవమున్న నేత. అలాంటి చంద్రబాబు ఈసారి మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తన పార్టీ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి వత్తాసు పలికినా ఎటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. కనీసం వారిపై అనర్హత వేటు వేయాలన్న పిటీషన్ ను కూడా చంద్రబాబు పార్టీ అధినేతగా స్పీకర్ కు ఇవ్వలేకపోయారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ TDP దారుణ ఓటమిని చవిచూసింది. 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ TDPచరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన ఓటమి. ఈ ఓటమిని జీర్ణించుకుని నిలదొక్కుకుందామనుకునే లోపే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. వారు పార్టీకి రాజీనామా చేయకుండానే వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. తెలుగుదేశం పార్టీ TDP పై విమర్శలు చేస్తున్నారు.
chandrababu
వదిలేయడంపై కేడర్ గుస్సా.. TDP
టీడీపీ TDP ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లు పార్టీని వీడారు. నలుగురు వైఎస్ జగన్ ను కలసి కండువా కప్పుకోకపోయినా, ఆ పార్టీకి మద్దతుదారులుగా మారారు. ఈ నలుగురిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటి వరకూ చంద్రబాబు స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇవ్వలేదు. వారిని చూసీ చూడనట్లు వదిలేశారు. ఇది పార్టీ క్యాడర్ లో ఇబ్బందిగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎటూ ఈ నలుగురు టీడీపీ నుంచి పోటీ చేయరు. చీరాల, గన్నవరం, గంటూరు పశ్చిమ, విశాఖ సౌత్ నియోజకవర్గాల నుంచి టీడీపీ TDP తరుపున కొత్త వారిని పోటీకి దింపాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో వీరి పట్ల చంద్రబాబు మెతక వైఖరిని ఎందుకు అవలంబిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే స్పీకర్ కు అనర్హత పిటీషన్ ఇచ్చినా పెద్దగా ఫలితం ఉండదని చంద్రబాబు యోచిస్తున్నారు. అయినప్పటికీ ఒక పార్టీ అధినేతగా పార్టీ నియమావళిని థిక్కరించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంది. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయలేకపోతున్నారు.
TDP
బహిష్కరించినా .. చాలని .. TDP
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైసీపీ అనర్హత పిటీషన్ స్పీకర్ కు ఇచ్చిన విషయాన్ని కేడర్ ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. వైసీపీ కూడా ఎంపీ రఘురామకృష్ణంరాజును బహిష్కరించలేదు. కానీ చంద్రబాబు ఈ నలుగురిని పార్టీ నుంచి బహిష్కరిస్తే, వైఎస్.జగన్ ను ఇరకాటంలోకి నెట్టే వీలుందని వీరంతా చెబుతున్నారు. అయితే చంద్రబాబు దానిని కూడా వినిగించుకోలేకపోతున్నారన్న టాక్ పార్టీలోనే విన్పిస్తుంది. అదే ఎందుకన్న చర్చ కేడర్ లో గట్టిగానే సాగుతోంది. ఈ నలుగురు పార్టీకి చేయందించడంతో, ఆ ప్రాంతాల్లో కేడర్ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. వీరిపై కనీసం బహిష్కార ముద్ర కూడా వేయలేకపోయారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తుండడంతో, కనీసం చంద్రబాబు ఆపనైనా చేయాలని వీరంతా కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంపై కనీసంగా కూడా స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. మే 31న అహ్మదాబాద్లోని Narendra Modi Stadium వేదికగా జరగనున్న గ్రాండ్…
Farmers : తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరోసారి గుడ్న్యూస్ చెప్పింది. రైతులు విక్రయించిన మొక్కజొన్నకు సంబంధించిన చెల్లింపులను వేగంగా…
White Guava vs Red Guava : జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఫలాల్లో ఒకటి. దీనిని…
Night Coffee : రాత్రి వేళల్లో కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, చదువులు లేదా…
Pani Puri : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్లలో పానీపూరి ఒకటి. గోల్ గప్పా, గప్చుప్, పుచ్కా…
Mahalakshmi Free Bus : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంలో కీలక మార్పులు…
Weight Loss : చాలామంది యువ వయసులో సులభంగా బరువు తగ్గగలుగుతారు. కానీ 40 ఏళ్లు దాటిన తర్వాత అదే…
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి జాతీయ రాజకీయాల కంటే రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమైంది. కాంగ్రెస్…
Heart Health : గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చాలామంది కొలెస్ట్రాల్ స్థాయిలను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెడుతుంటారు. అయితే తాజాగా…
This website uses cookies.