
#image_title
TS Govt | తెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరో సంతోషకరమైన ప్రకటన చేసింది. రాష్ట్రంలోని ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెలాఖరులోగా వరి కోతలు ప్రారంభం కానుండగా, అక్టోబర్ మొదటి వారం నుంచే అధికారికంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
#image_title
సన్నవరి రైతులకు బోనస్ కొనసాగింపు
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా సన్నవరి రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది చిన్నచైన రైతులకు పెద్ద ఊరటగా మారనుంది. ఈ బోనస్ కారణంగా ఈ సీజన్లో సాగు విస్తీర్ణం 60.39 లక్షల ఎకరాల నుంచి 65.96 లక్షల ఎకరాలకు పెరిగిందని అధికారిక సమాచారం.
రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 8,332 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గత ఖరీఫ్లో 7,139 కేంద్రాలే ఉండగా, ఈసారి సంఖ్య గణనీయంగా పెంచడం గమనార్హం. గతేడాది ధాన్యం ఉత్పత్తి: 146.28 లక్షల టన్నులు, కొనుగోలు చేసిన ధాన్యం: 91.28 లక్షల టన్నులు, ఈ ఏడాది ఉత్పత్తి అంచనా: 159.14 లక్షల టన్నులు, నిర్ణయించిన కొనుగోలు లక్ష్యం: 74.99 లక్షల టన్నులుగా ఉంది. సన్న మరియు దొడ్డు వరి రకాల కోసం వేర్వేరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించేలా ప్రభుత్వం యోచిస్తోంది.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.