Home » Exclusive » Upasana Met Pm Modi In Tourn Jeans Netizen Angry Over Her Dress
Exclusive

Upasana : చిరిగిన జీన్స్ తో నరేంద్ర మోడీని క‌లిసిన ఉపాస‌న‌… మెగా కోడలిపై నెటిజన్లు ఫైర్..!

Authored By
Breaking News 2
The Telugu News | Updated on: December 24, 2021 5:47 pm
Advertisement

Upasana : మెగాస్టార్ కోడలు, హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వృత్తి పరంగా అపోలో ఆసుపత్రి బాధ్యతలు చేపడుతూనే.. మరోవైపు ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఉపాసన. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‏గా ఉంటూనే.. ఫిట్‏నెస్ గురించి.. ఆయుర్వేద వైద్యం, జంతువుల సంరక్షణపై ఎప్పటికప్పుడు సూచనలిస్తూ వాటిపై జనాలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇటువంటి సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌తో ఎప్పుడు బిజీగా ఉండే ఉపాసన..

Advertisement

తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంగా తీసుకున్న ఓ ఫోటోను తన అభిమానులతో పంచుకున్నారు.ఫోటో కింద ఉపాసన ఈ విధంగా పేర్కొన్నారు. ఇండియన్ ఎక్స్‌పో- 2020లో భాగంగా జరిగిన సమావేశంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నట్లు ఆమె తెలిపారు. ఆవిష్కరణ.. ఆరోగ్య సంరక్షణ చర్యలను మరింత మెరుగుపరచడం.. మహిళా సాధికారత.. కల్చర్ పరిరక్షణ మీద దృష్టి సారించడం అనే అంశాలపై చర్చించినట్లు చెప్పుకొచ్చారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ…

upasana met pm modi in tourn jeans netizen angry over her dress

Advertisement

Upasana : ఉపాసనా డ్రెస్ పై విమర్శల వర్షం..!

ఉపాసన షేర్ చేసిన ఫోటోలో ఆమె ధరించిన దుస్తులు ఇప్పుడు ఆమెపై విమర్శలు వచ్చేలా చేశాయి.టోర్న్ జీన్స్ తో చిరిగిన ప్యాంట్ ధరించిన వైనాన్ని నెటిజన్లను తీవ్రంగా తప్పు పడుతున్నారు.భారత్ ప్రధానిని కలిసినప్పుడు కనీసం సంప్రదాయ పద్ధతిలో వెళ్లకుండా విదేశీ వస్త్ర ధారణతో వెళ్ళడం ఏమిటని సామాజిక మాధ్యమాల్లో ఉపాసనను ప్రశ్నించారు. సినీ ఫంక్షన్లలో ధరించే దుస్తులను ఇలాంటి గౌరవ సమావేశాల్లో ధరించడం పద్ధతి కాదని అంటున్నారు. ఇప్పుడీ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి