Categories: News

India Us Tariffs : భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ట్రంప్‌ .. సుంకాలపై కీలక నిర్ణయం

Advertisement
Published by
Advertisement

India Us Tariffs : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  Donald Trump  భారత్‌పై విధించిన ప్రతీకార టారిఫ్‌ల  India tariffs విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు 25 శాతంగా ఉన్న టారిఫ్‌లను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో  Truth Social  పోస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ కాల్ ద్వారా చర్చలు ముగిసిన వెంటనే ఈ ప్రకటన వెలువడడం రాజకీయంగా, ఆర్థికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఇది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

India Us Tariffs : భారత్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన ట్రంప్‌ .. సుంకాలపై కీలక నిర్ణయం

India Us Tariffs : మోదీతో ఫోన్ కాల్‌లో కీలక చర్చలు

ట్రంప్ తన పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీతో  Narendra Modi  జరిగిన ఫోన్ సంభాషణను ప్రస్తావించారు. మోదీని తన సన్నిహిత మిత్రుల్లో ఒకరిగా పేర్కొన్న ఆయన భారత్‌లో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ప్రశంసించారు. ఫోన్ కాల్‌లో వాణిజ్యం మాత్రమే కాకుండా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం అంతర్జాతీయ ఇంధన సరఫరా వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయడానికి మోదీ అంగీకరించారని ట్రంప్ వెల్లడించారు. అదే సమయంలో అమెరికా నుంచి అలాగే వెనెజువెలా నుంచి ఎక్కువ మొత్తంలో చమురు కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తి చూపిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ఉక్రెయిన్ సంక్షోభానికి ముగింపు పలకడంలో సహాయపడతాయని ప్రతివారం వేల మంది ప్రాణాలు కోల్పోతున్న ఆ యుద్ధానికి ఇది చరమగీతం పాడే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

India Us Tariffs : కొత్త వాణిజ్య ఒప్పందం .. 500 బిలియన్ డాలర్ల లక్ష్యం

మోదీ చేసిన విజ్ఞప్తి మేరకు అమెరికా–భారత్ మధ్య కొత్త వాణిజ్య ఒప్పందానికి  trade agreement  ఆమోదం తెలిపినట్లు ట్రంప్ తెలిపారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని దాని ప్రకారం ఇప్పటివరకు అమల్లో ఉన్న 25 శాతం టారిఫ్‌లు 18 శాతానికి తగ్గుతాయని స్పష్టం చేశారు. అదే సమయంలో భారత్ కూడా తన వైపు నుంచి టారిఫ్‌లను తగ్గిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో పూర్తిస్థాయి పన్ను రహిత వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకునే అవకాశముందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా తయారీ వస్తువుల కొనుగోలుపై భారత్ కట్టుబడి ఉంటుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వాణిజ్య పరిమాణం దాదాపు 500 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని తెలిపారు. ఇందులో ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయం, బొగ్గు తదితర కీలక రంగాల ఉత్పత్తులు ఉంటాయని వివరించారు. ఈ ఒప్పందంతో భారత్–అమెరికా సంబంధాలు మరింత దృఢంగా మారతాయని రెండు దేశాల భాగస్వామ్యం కొత్త ఎత్తులకు చేరుకుంటుందని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు.

India Us Tariffs : ట్రంప్‌నకు 140 కోట్ల మంది తరఫున కృతజ్ఞతలు

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ  PM Narendra Modi స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇకపై కేవలం 18 శాతం సుంకమే అమలులో ఉంటుందని వెల్లడించారు. ఈ నిర్ణయం భారత్‌కు ఎంతో ప్రయోజనకరమని మోదీ పేర్కొన్నారు. ఎక్స్‌ వేదికగా స్పందించిన ఆయన ఈ ప్రకటన పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిసి పనిచేస్తే ప్రపంచానికి మేలు జరుగుతుందని అన్నారు. కాగా మోదీ, ట్రంప్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నారని అమెరికాలో భారత రాయబారి సెర్గియో గోర్‌ వెల్లడించారు. జైశంకర్‌ అమెరికా పర్యటన వేళ ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement
Suma Ch

Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com

Recent Posts

Redmi 15A 5G : రెడ్‌మి 15A 5G భారత్‌లో లాంచ్‌ .. అదిరిపోయే డిజైన్, ఫీచర్లు ఇవే..!..!

Redmi 15A 5G : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Xiaomi కు చెందిన సబ్-బ్రాండ్ Redmi భారత మార్కెట్‌లో తన…

4 hours ago

Sunrisers Hyderabad : IPL 2026 మొద‌లేకాలేదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల మధ్య గొడ‌వ‌లు.. అస‌లేం జ‌రిగింది..?

SRH Players : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన…

5 hours ago

PNG Connection : పీఎన్‌జీ గ్యాస్‌కు పెరుగుతున్న డిమాండ్ .. కనెక్షన్ ఎలా తీసుకోవాలి ? .. ఛార్జీలు ఎంత ?.. వివరాలివే ..!

PNG Connection : దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పైప్‌లైన్ నేచురల్ గ్యాస్ (PNG)పై ప్రజల్లో…

6 hours ago

Donald Trump : ట్రంప్ కి పళ్ళు రాలిపోయే సమాధానం చెప్పిన ఇరాన్.. హార్ముజ్ జలసంధి విషయం లో సంచలనం

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత పద్ధతిలోనే ఇరాన్…

7 hours ago

Revanth Reddy : రైతులకి ఆనందంతో గంతులేసే రెండు శుభవార్తలు చెప్పిన CM రేవంత్

Revanth Reddy : తెలంగాణ అన్నదాతల ముఖాల్లో చిరునవ్వులు పూయించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రెండు అదిరిపోయే…

8 hours ago

Modi on Iran : ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఒకే ఒక్క మాట చెప్పిన మోడీ…!

Modi on Iran : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న ఒక…

9 hours ago

Dhurandhar 2 Collections : బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం .. ఇక 500 క్లబ్ లోకి చేరినట్లేనా..?

Dhurandhar 2 Collections : బాలీవుడ్ Bollywood స్టార్ హీరో రణవీర్ సింగ్ Ranveer Singh నటించిన లేటెస్ట్ యాక్షన్…

10 hours ago

Garikapati Narasimha Rao : బిగ్ బ్రేకింగ్.. గరికపాటి ని అరెస్ట్ చేయాలి.. సోష‌ల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌లు..?

Garikapati Narasimha Rao : ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తన…

11 hours ago

Vidadala Rajini : విడదల రజని కి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ .. వైసీపీకి రాజీనామా ?

Vidadala Rajini : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజం కాబోతోందా? గత కొద్ది…

12 hours ago

Gas Cylinder : గ్యాస్ వినియోగదారులకు అలర్ట్ .. గ్యాస్‌ సరఫరాలో మరిన్ని కష్టాలు .. కానీ ..!

Gas Cylinder  :  మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్…

12 hours ago

Realme 5G : భారత మార్కెట్‌లో రియల్‌మీ 5G స్మార్ట్‌ఫోన్ దూకుడు .. కేవలం 7,599 రూపాయలకే .. ఫీచర్లు ఇవే ..!

Realme 5G :  భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ రంగం రోజురోజుకు విస్తరిస్తుండగా రియల్‌మీ బ్రాండ్ వేగంగా ఎదుగుతూ వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించింది.…

13 hours ago

Rythu Bharosa : రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ .. ఆ డబ్బులు విడదల .. నేడు బ్యాంకుల్లో నగదు జమ ..

Rythu Bharosa : తెలంగాణలో సాగు ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం అమలు…

14 hours ago