why revanth reddy over reacting on ys sharmila party
Revanth Reddy : రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం బిజీగా ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. పార్టీని పునరుత్తేజం చేయాలని రేవంత్ రెడ్డి కసి మీద ఉన్నారు. అందుకే.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని.. అధికార పార్టీపై, ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు.
నిజానికి కాంగ్రెస్ పార్టీలో బలమైన వాయిస్ వినిపించేది రేవంత్ రెడ్డి మాత్రమే. ఆయన లేకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే లేదు. ఆయనే ప్రస్తుతం పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. కనీసం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయినా గెలిచి.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బతికే ఉందని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
why revanth reddy over reacting on ys sharmila party
అంతవరకు బాగానే ఉంది కానీ.. ఎందుకో రేవంత్ రెడ్డి.. వైఎస్ షర్మిలను టార్గెట్ చేస్తున్నారేమో అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన ప్రసంగించిన ప్రతిసారీ షర్మిలను లాగుతున్నారని.. అసలు షర్మిల గురించి రేవంత్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు.
నిజానికి తెలంగాణలో వైఎస్ షర్మిల ఇంకా పార్టీనే పెట్టలేదు. పెట్టినా ఆమె పార్టీకి అంత ప్రాధాన్యత ఉండదని.. రేవంత్ రెడ్డి అనవసరంగా వైఎస్ షర్మిల గురించి మాట్లాడి ఆమెకే ప్రాధాన్యత కల్పిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇతర నేతలు కూడా షర్మిల పార్టీ గురించి పెద్దగా స్పందించలేదు. కానీ.. ఎక్కువ సార్లు స్పందించింది రేవంత్ రెడ్డి మాత్రమే.
ఒక రకంగా చెప్పాలంటే.. షర్మిల పార్టీ పెట్టకముందే.. రేవంత్ రెడ్డి వర్సెస్ షర్మిల వర్గం అన్నట్టుగా తయారైంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇదే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున రేవంత్ రెడ్డి ఎందుకు లేనిపోని సమస్యలు తెచ్చుకోవడం.. షర్మిల గురించి ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.