why there is no rahul gandhi bharat jodo yatra in gujarat
YS Jagan : ఒకప్పుడు విశాఖపట్నం అంటే కేవలం సముద్రం మాత్రమే గుర్తుకు వచ్చేది. ఎంతో అద్బుతమైన విశాఖ ను గత ప్రభుత్వాల చేతకాని తనం వల్ల అభివృద్ది కాకుండా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో మొత్తం అభివృద్దిని హైదరాబాద్ లో చేయడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో వైజాగ్ ను పట్టించుకోలేదు. కాని ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుండి వైజాగ్ దశ తిరిగి పోయింది. ప్రతి విషయంలో కూడా వైజాగ్ ను నెం.1 ఉంచేందుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
రాష్ట్రం కు రాజధానిగా కూడా వైజాగ్ ను చేసిన ఘనత కేవలం జగన్ మోహన్ రెడ్డికే దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వైజాగ్ అంటే ప్రతి ఒక్కరికి సముద్రం మాత్రమే కాకుండా ఏపీ యొక్క రాజధాని అంటూ గుర్తుకు వస్తుంది. ఇక నుండి ఇన్ఫోసిస్ యొక్క అతి పెద్ద కార్యాలయం కూడా వైజాగ్ లోనే ఉందనే విషయం గుర్తుకు వస్తుంది. రాష్ట్రం కే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా భావిస్తున్న ఇన్ఫోసిస్ వల్ల రాష్ట్రంలో ఐటీ అభివృద్ది అద్బుతంగా జరగబోతుంది. ఇప్పటికే వైజాగ్ లో ఐటీ కారిడార్ ను ఏర్పాటు చేసి సాఫ్ట్ వేర్ హబ్ సెంటర్ గా వైజాగ్ ను మార్చేందుకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు మరియు వైజాగ్ కు చెందిన ప్రముఖులు చాలా సంతోషంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది.
YS Jagan ysrcp government doing development in Vishakhapatnam
గతంలో వైజాగ్ ను పట్టించుకోకుండా వదిలేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు తమకు వైజాగ్ పై చాలా ప్రేమ ఉంది.. మేము అధికారంలోకి వస్తే మిమ్ముల అభివృద్ది చేస్తాం అంటూ చెబుతూ వస్తున్నారు. కాని వారు ఇన్నాళ్లు చేసింది ఏంటీ అంటూ వైకాపా నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు దేశం పార్టీకి అసలు వైజాగ్ యొక్క అభివృద్ది విషయంలో చిత్తశుద్ది లేదు. అందుకే వైజాగ్ లో రాజధాని ఏర్పాటుకు మోకాళు అడ్డుతున్నారు. అక్కడ ఎలాంటి అభివృద్దిని టీడీపీ కోరుకోవడం లేదు. అభివృద్ది పనులకు అడ్డు తగులుతూ వైజాగ్ అభివృద్దికి ఆటంకం కలిగించడం వారి పనైంది అంటూ వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ వల్ల వైజాగ్ ప్రజల్లో తాము కూడా హైదరాబాద్ స్థాయికి అభివృద్ది చెందుతామని ఆశలు చిగురిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.