Bandla Ganesh : ప్రస్తుతం ఏపీ అంతా ఒకటే ట్రెండింగ్ టాపిక్. అదే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలవడం. అది కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను వెనువెంటనే కలవడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసలు.. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబును బీజేపీ నేతలు ఖాతరు చేయలేదు. దానికి కారణం.. ఎన్నికలకు ముందు రెండు పార్టీల మధ్య జరిగిన లొల్లి. బీజేపీతో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే.
మళ్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ నేతలు చంద్రబాబును దగ్గరకు తీయలేదు. కానీ.. ఏపీలో ఇంకో సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయనగా.. ఇప్పుడు తాజాగా చంద్రబాబుకు బీజేపీ హైకమాండ్ అపాయింట్ మెట్ ఇవ్వడం సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అంతే కాదు.. బీజేపీ, టీడీపీ పొత్తులు కూడా ఇప్పుడు తెరమీదికి వచ్చాయి. కానీ.. టీడీపీ కార్యకర్తలకు, అభిమానులకు ఈ పొత్తు నచ్చడం లేదు. తాజాగా.. టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ బీజేపీ, టీడీపీ పొత్తుపై ఓ ట్వీట్ వదిలారు. అది మామూలు ట్వీట్ కాదు. స్ట్రాంగ్ ట్వీట్ అనే చెప్పుకోవాలి.
కర్మ కర్మ.. కాకపోతే ఇంకేంటి ఆయన ఏం అంటే అది అనాలి. సీపీఎం అంటే సీపీఎం అనాలా.. బీజేపీ అంటే బీజేపీ అనాలా.. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనాలా? జనసేన అంటే జనసేన అనాలి. ఆయన కన్వీనెంట్ గా ఏ పేరు చెబితే దాన్నే అందరూ ఫాలో అవ్వాలి. అంతే కానీ.. ఎవ్వరికీ ఆత్మాభిమానం, మంచి, చెడు, మానవత్వం ఉండదా? ఆయన పొగిడితేనే జాతిని పొగిడినట్టా.. లేకపోతే జాతికి ద్రోహం చేసినట్టా.. ఇంతకంటే దరిద్రం ఇంకేవాలి అంటూ బండ్ల గణేష్ స్ట్రాంగ్ ట్వీట్ వేశారు. ఇందులో చంద్రబాబు ప్రస్తావన తీసుకురాలేదు బండ్ల గణేష్. కానీ.. టీడీపీ, బీజేపీ పొత్తు మీద వేరే వాళ్ల కామెంట్లకు బండ్ల గణేష్ ఈ ట్వీట్ చేశారు కాబట్టి ఆయన ట్వీట్ ఖచ్చితంగా టీడీపీ, బీజేపీ పొత్తు మీద అనే భావించాల్సి వస్తోంది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.