Home » News » Bharathi Cement Issue Explained Tdp
News

Bharathi Cement : భారతీ సిమెంట్స్ భాగోతం బయటకి లాగుతున్న టీడీపీ..?

Authored By
Siddhu Manchikanti
The Telugu News | Updated on: February 21, 2026 2:54 pm
Advertisement

Bharathi Cement : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Ys Jagan  అధికారంలో ఉన్నప్పుడు తన సొంత కంపెనీ భారతీ సిమెంట్స్ Bharathi Cement కోసం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ పథకాలకు అవసరమైన సిమెంట్ కొనుగోళ్లలో భారతీ సిమెంట్స్ కు పెద్దపీట వేస్తూ వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచిపెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ పనుల కోసం సిమెంట్ కొనేటప్పుడు తక్కువ ధర కోట్ చేసిన సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ జగన్ మాత్రం తన అధికార బలంతో మార్కెట్ ధర కంటే ఎక్కువ రేటుకు తన సొంత కంపెనీ దగ్గరే సిమెంట్ కొనేలా ఒప్పందాలు చేసుకున్నట్లు ఆధారాలు బయటపడుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడటమే కాకుండా ఇతర సంస్థలకు అన్యాయం జరిగిందని టీడీపీ నాయకులు ఇప్పుడు గట్టిగా వాదిస్తున్నారు.

Advertisement

Bharathi Cement : భారతీ సిమెంట్స్ భాగోతం బయటకి లాగుతున్న టీడీపీ..?

జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టిట్కో ఇళ్ల నిర్మాణంలో భారతీ సిమెంట్స్ వాటా చాలా ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేశారు. మిగిలిన సిమెంట్ కంపెనీల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చి తన సంస్థ వృద్ధి రేటును పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర వృద్ధి రేటు కంటే తన సొంత కంపెనీ ఆస్తులు ఎలా పెరగాలనే దానిపైనే జగన్ దృష్టి పెట్టారని ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈ కంపెనీకి సంబంధించిన సున్నపు గనుల లీజుల వ్యవహారంలో కూడా అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టింది. లీజు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తేలితే ఆ లీజులను రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Advertisement

Bharathi Cement  వైఎస్ భారతి సిమెంట్ కంపెనీకి కష్టకాలం మొదలైంది

కేవలం వ్యాపార లావాదేవీలే కాకుండా భూములు ఇచ్చిన రైతుల పట్ల భారతీ సిమెంట్స్ వ్యవహరించిన తీరుపై కూడా ఇప్పుడు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సిమెంట్ ఫ్యాక్టరీ కోసం తమ భూములను తక్కువ ధరకే ధారాదత్తం చేసిన స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి తీరా కంపెనీ వచ్చాక వాళ్లను నట్టేట ముంచారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పది పదిహేను వేల రూపాయల జీతానికే వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని బాధితులు ఫ్యాక్టరీ ముందు ప్లకార్డులతో ధర్నా చేస్తున్నారు. మహిళా ప్రతినిధిగా ఉన్న భారతి కనీసం తమ గోడు వినడం లేదని స్థానిక ఆడపడుచులు శాపనార్థాలు పెడుతున్నారు. ప్రజల భూములు లాక్కోవడమే కాకుండా వారికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి సొంత లాభం చూసుకున్నారని ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మద్యం కుంభకోణంలో భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అరెస్ట్ అవ్వడం ఈ వ్యవహారంలో మరో మలుపుగా మారింది. మద్యం సిండికేట్లకు మరియు ఈ సిమెంట్ కంపెనీకి మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను ఇప్పుడు దర్యాప్తు సంస్థలు బయటకు తీస్తున్నాయి. అవినీతి సొమ్మును ఈ కంపెనీ ద్వారా దారి మళ్లించారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు వైఎస్ భారతిని కూడా విచారణకు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో అమరావతి మహిళల పట్ల సాక్షి ఛానల్ లో జరిగిన అవమానకర చర్చలకు కూడా భారతి బాధ్యురాలని ప్రజలు గుర్తిస్తున్నారు. మొత్తానికి జగన్ మరియు భారతి కలిసి చేసిన ఈ వ్యాపార రాజకీయం ఇప్పుడు వారి మెడకు ఉచ్చులా బిగుస్తోంది. ఈ కుంభకోణాలన్నీ బయటపడితే రాజకీయంగా ఆ కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది.

Siddhu Manchikanti

Author Bio Info : Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15+ years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి