#image_title
Nara Bhuvaneswari : ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. ఆయన అరెస్ట్ పై టీడీపీ నేతలు రోడ్డు మీదికి వచ్చి భగ్గుమంటున్నారు. అసలు ఇప్పటి వరకు రాజకీయాలు అంటే ఏంటో కూడా తెలియని చంద్రబాబు భార్య భువనేశ్వరి, ఆయన కోడలు బ్రాహ్మణి కూడా బయటికి వచ్చి నిరసన తెలుపుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు. భువనేశ్వరి తన వల్ల అయ్యేవన్నీ చేస్తున్నారు. మహిళలను పిలవడం, వాళ్లతో క్యాండిల్ ర్యాలీ చేయించడం, మోత మోగించడం, నిరాహార దీక్ష.. ఇలా అన్ని రకాలుగా భువనేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ.. భువనేశ్వరి ఇటీవల రాజమండ్రిలో నిరాహార దీక్ష చేపట్టారు. మరో అడుగు ముందుకేస్తూ ప్రజా క్షేత్రంలోనే తాడోపేడో తేల్చుకునేందుకు భువనేశ్వరి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
భువనేశ్వరి బస్సు యాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది. కుప్పం నుంచి మేలుకో తెలుగోడా బస్సు యాత్రను నిర్వహించాలని నారా భువనేశ్వరి నిర్ణయించినట్టు తెలుస్తోంది. బస్సు యాత్ర ప్రారంభించవచ్చన్న వార్తల నేపథ్యంలో టీడీపీ నేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొందరు టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఈ యాత్రను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ముందుగా కుప్పం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ యాత్ర నిర్వహించే అవకాశం ఉంది. అలాగే.. భువనేశ్వరి ఆధ్వర్యంలో బహిరంగ సభను కూడా నిర్వహించాలని టీడీపీ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. రాజమండ్రిలో భువనేశ్వరి చేసిన నిరాహార దీక్షకు భారీగానే స్పందన లభించడంతో అలాగే… ఆమెతో బస్సు యాత్రను కూడా చేయించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు.
#image_title
నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ.. ఈ ముగ్గురు రాజమండ్రిలోనే ఉన్నారు. పార్టీ నేతలు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలుపుతున్నారు. పార్టీ క్యాడర్ కి కూడా వీళ్లు మార్గనిర్దేశనం చేస్తున్నారు. అయితే.. భువనేశ్వరితో బస్సు యాత్ర నిర్వహించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. రూట్ మ్యాప్ కూడా నిర్ణయించారట. స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై ఇప్పటికే కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ పై కూడా కోర్టు ఇంకా ఎలాంటి తీర్పు వెల్లడించలేదు. ఆయన రిమాండ్ పై కూడా కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వెలువడుతుందో వేచి చూసి ఆ తర్వాత భువనేశ్వరి బస్సు యాత్ర నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
This website uses cookies.