KCR – Chandrababu : ప్రస్తుతం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు యశోద ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, మెగాస్టార్ చిరంజీవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ను పరామర్శించారు. తాజాగా కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ను పరామర్శించి ఆయన బాగోగులు తెలుసుకున్నారు. ఆయనకు జరిగిన ప్రమాదంపై చంద్రబాబు ఆరా తీశారు. కేసీఆర్ బెడ్ పక్కన కూర్చొని కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.
నిజానికి చంద్రబాబు, కేసీఆర్ దోస్తులే. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే స్టార్ట్ అయింది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ కలిసి చాలా ఏళ్లు టీడీపీలో కలిసి పని చేశారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య సాన్నిహిత్యం ఉంది. అయితే.. ఆ తర్వాత ఇద్దరూ రాజకీయాల్లో శత్రువులు అయ్యారు. రాజకీయాల్లో శత్రువులు అయినప్పటికీ.. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ మాత్రం అలాగే ఉంది. అందుకే.. కేసీఆర్ కాలుకు సర్జరీ జరిగిందని తెలియగానే చంద్రబాబు పరిగెత్తుకుంటూ యశోద ఆసుపత్రికి వచ్చి ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
చంద్రబాబు కేటీఆర్ తోనూ కాసేపు చర్చించారు. కేసీఆర్ ను జాగ్రత్తగా చూసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. అనంతరం బయటికి వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అయితే.. చంద్రబాబు.. యశోద ఆసుపత్రికి వచ్చారని తెలిసి ఆయన అభిమానులు ఆసుపత్రికి భారీ సంఖ్యలో వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలని ఆయనకు చెప్పానని అన్నారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.