KCR – Chandrababu : కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో చంద్రబాబు ఏమన్నారో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

KCR – Chandrababu : కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం మీడియాతో చంద్రబాబు ఏమన్నారో తెలుసా?

KCR – Chandrababu : ప్రస్తుతం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు యశోద ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, మెగాస్టార్ చిరంజీవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ను పరామర్శించారు. తాజాగా కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ను పరామర్శించి ఆయన బాగోగులు తెలుసుకున్నారు. ఆయనకు జరిగిన ప్రమాదంపై […]

 Authored By kranthi | The Telugu News | Updated on :12 December 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు

  •  యశోద ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు

  •  అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు

KCR – Chandrababu : ప్రస్తుతం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించడానికి తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు యశోద ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, మెగాస్టార్ చిరంజీవి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ను పరామర్శించారు. తాజాగా కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ను పరామర్శించి ఆయన బాగోగులు తెలుసుకున్నారు. ఆయనకు జరిగిన ప్రమాదంపై చంద్రబాబు ఆరా తీశారు. కేసీఆర్ బెడ్ పక్కన కూర్చొని కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు.

నిజానికి చంద్రబాబు, కేసీఆర్ దోస్తులే. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం టీడీపీతోనే స్టార్ట్ అయింది. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ కలిసి చాలా ఏళ్లు టీడీపీలో కలిసి పని చేశారు. అప్పటి నుంచి వీళ్ల మధ్య సాన్నిహిత్యం ఉంది. అయితే.. ఆ తర్వాత ఇద్దరూ రాజకీయాల్లో శత్రువులు అయ్యారు. రాజకీయాల్లో శత్రువులు అయినప్పటికీ.. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ మాత్రం అలాగే ఉంది. అందుకే.. కేసీఆర్ కాలుకు సర్జరీ జరిగిందని తెలియగానే చంద్రబాబు పరిగెత్తుకుంటూ యశోద ఆసుపత్రికి వచ్చి ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

KCR – Chandrababu : కేటీఆర్ తోనూ కాసేపు మాట్లాడిన చంద్రబాబు

చంద్రబాబు కేటీఆర్ తోనూ కాసేపు చర్చించారు. కేసీఆర్ ను జాగ్రత్తగా చూసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. అనంతరం బయటికి వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అయితే.. చంద్రబాబు.. యశోద ఆసుపత్రికి వచ్చారని తెలిసి ఆయన అభిమానులు ఆసుపత్రికి భారీ సంఖ్యలో వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, ధైర్యంగా ఉండాలని ఆయనకు చెప్పానని అన్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది