Cross Voting : ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఉండగా, ఈ సారి ఆ పార్టీని రాకుండా చూడాలని టీడీపీ, జనసేన, బీజేపీ కంకణం కట్టుకున్నాయి. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు కూడా పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో ఆ బిజీలో ఉన్నారు. ఎప్పటి మాదిరే ఈసారి కూడా చంద్రబాబు స్వయంగా నామినేషన్ వేయడం లేదు. చంద్రబాబు తరపున ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారులకు భువనేశ్వరి నామినేషన్ పత్రాలను అందించారు.
చంద్రబాబు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు తరలి వచ్చాయి.అయితే ఇప్పుడు ఈ మూడు పార్టీలకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. దానికి కారణం ఈ మూడు పార్టీలు కూడా ఉమ్మడిగా చాలాచోట్ల ప్రచారాన్ని నిర్వహించకపోవడమే కారణం. శాసనసభ కు పోటీ చేస్తున్న అభ్యర్థులు కేవలం తాము పోటీ చేసే స్థానం విషయం గురించే ప్రజలకు వివరిస్తూ, తమ పార్టీ గుర్తుని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు తప్ప పొత్తులో భాగంగా ఎంపీ స్థానాల్లో వేరే పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నా, ఆ గుర్తు గురించి ఎమ్మెల్యే అభ్యర్ధుల గురించి ప్రచారం నిర్వహించకపోవడంపై ఇప్పుడు గందరగోళం నెలకొంది.
రెండు గుర్తులని ప్రచారం చేస్తే ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు గుర్తు గురించి ప్రచారం చేయడం లేదని తెలుస్తుంది. అయితే ఈ కూటమి పార్టీల్లో కొత్త ఆందోళనకు తెరతీసింది. ఇంకా ఇదే పరిస్థితి కొనసాగితే పోలింగ్ సమయంలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందని, దీని కారణంగా మూడు పార్టీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల ఫలితాల్లో శాసనసభ నియోజకవర్గాల్లో ఒక పార్టీ అభ్యర్థి గెలిచి, పార్లమెంట్ కు పోటీ చేసిన కూటమి అభ్యర్థి ఓడిపోతే, క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతుంది.
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
Electric Tractor : రైతులకు శుభవార్త... వ్యవసాయంలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచే సరికొత్త ట్రాక్టర్ను మహారాష్ట్రకు చెందిన యువకుడు అభివృద్ధి…
This website uses cookies.