
Good News : ఏపీకి సూపర్ గుడ్న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
Good News : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి అక్కడి ప్రజలకి అన్ని గుడ్ న్యూస్లు అందుతున్నాయి. తాజాగా కేంద్రం మరో కొత్త శుభవార్త చెప్పింది. సాధారణంగా రైల్వే గేటు పడితే సుమారు అరగంట ఆగాల్సిందే. అత్యవసరంగా వెళ్లే వాహనాలైనా గేటు తీసేవరకూ నిరీక్షించాల్సిందే. ఎంత దూరం నుంచి వచ్చినా, పక్క ప్రాంతం నుంచి వచ్చినా వాహనాలకు బ్రేక్ వేయాల్సిందే. కొన్ని ప్రాంతాలలో రైల్వేగేటు వద్ద దశాబ్దాల కాలం నుంచి తిష్ఠవేసిన సమస్య ఇది. ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి గానీ, ఫ్లైఓవర్ గానీ నిర్మించాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించేందుకు సిద్దమైంది. ఈ మేరకు క్షేత్రస్దాయిలో అధికారులు రంగంలోకి దిగారు.
Good News : ఏపీకి సూపర్ గుడ్న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
దేశవ్యాప్తంగా రైల్వేశాఖ చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా ఇలాంటి రైల్వే గేట్లను తొలగించి వాటి స్ధానంలో వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు.2027 నాటికి దేశవ్యాప్తంగా రైల్వే గేట్లను పూర్తిగా తొలగించాలని భావిస్తున్న కేంద్రం వాటి స్ధానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జులను నిర్మించాలని యోచిస్తుంది.. ఇందుకోసం ఏపీలోనూ భారీ సంఖ్యలో ఉన్న రైల్వే గేట్లపై సర్వే నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలో మొత్తం 390 రైల్వే గేట్లు ఉన్నట్లు తేల్చారు. 100గేట్లను ఇప్పటికే సర్వే చేసేసిన అధికారులు మరికొన్ని రోజుల్లో మిగిలిన గేట్లను కూడా పరిశీలించి వాటిపై ఓ నిర్ణయానికి వస్తారట.
ప్రత్యేకంగా నిధులు కేటాయించి రైల్వే గేట్ల స్ధానంలో వంతెనలు నిర్మించనున్నారు. దీని వల్ల దశాబ్దాలుగా జనం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు ప్రజలకు భారీగా సమయం కూడా ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.ఇదిలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. మేర కొత్త రైలు మార్గం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఈ నూతన రైల్వేలైను పనులకు సంబందించి తొలి అడుగు పడింది
Tamil Nadu Elections : తమిళనాడులో ఇప్పుడు ఎన్నికల వేడి మామూలుగా లేదు. అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని డీఎంకే, ఏఐడీఎంకే…
Vijay Deverakonda : సాధారణంగా టయర్ 2 హీరోలకు వరుసగా కొన్ని ఫ్లాపులు పడితే, నిర్మాతలు బడ్జెట్ తగ్గించేసి రిస్క్…
Telangana : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. అదేంటంటే, కొంతకాలంగా ఫామ్ హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత…
Pawan Kalyan : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానుల్లో…
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
This website uses cookies.