
Good News : ఏపీకి సూపర్ గుడ్న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
Good News : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుండి అక్కడి ప్రజలకి అన్ని గుడ్ న్యూస్లు అందుతున్నాయి. తాజాగా కేంద్రం మరో కొత్త శుభవార్త చెప్పింది. సాధారణంగా రైల్వే గేటు పడితే సుమారు అరగంట ఆగాల్సిందే. అత్యవసరంగా వెళ్లే వాహనాలైనా గేటు తీసేవరకూ నిరీక్షించాల్సిందే. ఎంత దూరం నుంచి వచ్చినా, పక్క ప్రాంతం నుంచి వచ్చినా వాహనాలకు బ్రేక్ వేయాల్సిందే. కొన్ని ప్రాంతాలలో రైల్వేగేటు వద్ద దశాబ్దాల కాలం నుంచి తిష్ఠవేసిన సమస్య ఇది. ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జి గానీ, ఫ్లైఓవర్ గానీ నిర్మించాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో ప్రధాన సమస్యకు పరిష్కారం చూపించేందుకు సిద్దమైంది. ఈ మేరకు క్షేత్రస్దాయిలో అధికారులు రంగంలోకి దిగారు.
Good News : ఏపీకి సూపర్ గుడ్న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
దేశవ్యాప్తంగా రైల్వేశాఖ చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా ఇలాంటి రైల్వే గేట్లను తొలగించి వాటి స్ధానంలో వంతెనలు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు బడ్జెట్ కేటాయింపులు కూడా చేశారు.2027 నాటికి దేశవ్యాప్తంగా రైల్వే గేట్లను పూర్తిగా తొలగించాలని భావిస్తున్న కేంద్రం వాటి స్ధానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జులను నిర్మించాలని యోచిస్తుంది.. ఇందుకోసం ఏపీలోనూ భారీ సంఖ్యలో ఉన్న రైల్వే గేట్లపై సర్వే నిర్వహిస్తోంది. ఇందులో రాష్ట్రంలో మొత్తం 390 రైల్వే గేట్లు ఉన్నట్లు తేల్చారు. 100గేట్లను ఇప్పటికే సర్వే చేసేసిన అధికారులు మరికొన్ని రోజుల్లో మిగిలిన గేట్లను కూడా పరిశీలించి వాటిపై ఓ నిర్ణయానికి వస్తారట.
ప్రత్యేకంగా నిధులు కేటాయించి రైల్వే గేట్ల స్ధానంలో వంతెనలు నిర్మించనున్నారు. దీని వల్ల దశాబ్దాలుగా జనం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలు తీరడంతో పాటు ప్రజలకు భారీగా సమయం కూడా ఆదా అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం అవుతుంది.ఇదిలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు 57 కి.మీ. మేర కొత్త రైలు మార్గం దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఈ నూతన రైల్వేలైను పనులకు సంబందించి తొలి అడుగు పడింది
Kodali Nani : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ పాత ముఖాలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల పాటు…
Viral video : టాలీవుడ్లో Tollywood కిసిక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న శ్రీలీల Sreeleela తన అందంతోనే కాదు, అద్భుతమైన…
AP Cabinet : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మంత్రివర్గ విస్తరణ గురించే చర్చ నడుస్తోంది. అటు ఢిల్లీ…
Vijay Deverakonda : సినీ నటుడు విజయ్ దేవరకొండ స్వగ్రామస్తులతో భావోద్వేగపూర్వకంగా మాట్లాడి అందరి హృదయాలను హత్తుకున్నారు. తనకు సొంతూరుతో…
T Ration App : తెలంగాణ Telangana రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రూపొందించిన T Ration App సామాన్య ప్రజలకు…
Modi : ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధం చాలా తీవ్ర రూపం దాల్చింది. ఫిబ్రవరి 2026 చివరి…
Indiramma Houses : ఖమ్మం జిల్లాలో భూదాన్ భూములపై నిర్మించుకున్న ఇళ్ల కూల్చివేత అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ…
NPCIL : దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్…
Viral news : కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక చిన్న మొత్తం వివాదం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా…
Sanju Samson : టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో వెస్టిండీస్ జట్టు భారత్పై…
Schools Holiday : సాధారణంగా మార్చి నెల అనగానే విద్యార్థులకు పరీక్షల హడావుడి గుర్తుకు వస్తుంది. వార్షిక పరీక్షలు, బోర్డు…
Kisan Aashirvad Scheme : భారతదేశంలో వ్యవసాయం కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదు, కోట్లాది కుటుంబాల జీవనాధారం. ముఖ్యంగా…
This website uses cookies.