Ration Rice : కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం..!
Ration Rice : తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ను ఒకేసారి జూన్లోనే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వానాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రవాణాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావించడంతో, ముందుగానే మూడు నెలల బియ్యం, గోధుమలు, చక్కెరను పంపిణీ చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.
Ration Rice : కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం..!
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. జూన్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో మూడు నెలల రేషన్ సరఫరా ప్రారంభమవుతుంది. జూన్ 30 లోపు పంపిణీ పూర్తయ్యేలా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి లబ్దిదారుడికి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆధారంగా నెలకు 6 కిలోల చొప్పున, మూడు నెలలకు 18 కిలోల బియ్యం ఒకేసారి అందజేయనున్నారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు.
ఇదేకాకుండా చక్కెర కిలో రూ.13.50కు, గోధుమలు కిలో రూ.7కు రాయితీ ధరలకే లభించనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 5 కేజీల చొప్పున, ఇతర కార్పొరేషన్లలో 2 కేజీల చొప్పున గోధుమలు పంపిణీ చేయనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పంపిణీ సమయంలో అవగాహనతో రేషన్ను తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముందస్తుగా మూడు నెలల రేషన్ పంపిణీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండనుందని ప్రభుత్వం భావిస్తోంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.