
Ration Rice : కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం..!
Ration Rice : తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. జూన్, జూలై, ఆగస్టు నెలల రేషన్ను ఒకేసారి జూన్లోనే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వానాకాలంలో భారీ వర్షాలు, వరదల కారణంగా రవాణాలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావించడంతో, ముందుగానే మూడు నెలల బియ్యం, గోధుమలు, చక్కెరను పంపిణీ చేయాలని సూచించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది.
Ration Rice : కేంద్రం గుడ్ న్యూస్.. ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం..!
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం.. జూన్ 1 నుంచి అన్ని రేషన్ దుకాణాల్లో మూడు నెలల రేషన్ సరఫరా ప్రారంభమవుతుంది. జూన్ 30 లోపు పంపిణీ పూర్తయ్యేలా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రతి లబ్దిదారుడికి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఆధారంగా నెలకు 6 కిలోల చొప్పున, మూడు నెలలకు 18 కిలోల బియ్యం ఒకేసారి అందజేయనున్నారు. అంత్యోదయ కార్డుదారులకు 35 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వనున్నారు.
ఇదేకాకుండా చక్కెర కిలో రూ.13.50కు, గోధుమలు కిలో రూ.7కు రాయితీ ధరలకే లభించనున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 5 కేజీల చొప్పున, ఇతర కార్పొరేషన్లలో 2 కేజీల చొప్పున గోధుమలు పంపిణీ చేయనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పంపిణీ సమయంలో అవగాహనతో రేషన్ను తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముందస్తుగా మూడు నెలల రేషన్ పంపిణీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండనుందని ప్రభుత్వం భావిస్తోంది.
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…
Samantha : ఢిల్లీలో అట్టహాసంగా జరిగిన భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్…
This website uses cookies.