
#image_title
Akepati Subhashini : ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ పైనే చర్చ నడుస్తోంది. అది కాస్త యూటర్న్ తీసుకొని ఎటువైపో వెళ్తోంది. కొన్ని రోజులు బండారు, రోజా వైపు మళ్లింది. తాజాగా పవన్ కళ్యాణ్ పై మళ్లింది. ఆయనపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై జనసేన నేతలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైసీపీ నేతలకు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఈనేపథ్యంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకెపాటి సుభాషిణి.. సీఎం జగన్, మంత్రి రోజాపై విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసినందుకు మేము జగన్ మోహన్ రెడ్డిపై ప్రెస్ మీట్ పెట్టాం. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది కదా. ఎందుకు మీకు భయం. ఈరోజు మహిళలకు ఎందుకు భయపడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి చేసింది వంద శాతం తప్పు. ఆయన తప్పు చేశాడని చెప్పడానికి ఈరోజు మహిళలం అందరం ప్రెస్ మీట్ పెట్టాం. దీంతో ఇప్పటి వరకు ఎప్పుడూ రాని పోలీసులు.. లోపల అడుగు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోసం మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు జనసేన జెండా మా భుజాల మీద ఉంటుంది.. అని ఆమె మండిపడ్డారు.
ఇలాంటి పిచ్చి పిచ్చి కంప్లైంట్లకు భయపడేది లేదు. చిత్తూరు జిల్లా లీడర్లకు, టీడీపీ లీడర్లకు ధన్యవాదాలు. ఇంత లేట్ అయినా కూడా మాకు సపోర్ట్ చేశారు. న్యాయం పక్కన నిలబడ్డారు. న్యాయం గెలిచింది. ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 2024 లో జనసేన జెండా ఎగురవేయడం ఖాయం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీల మీద అనవసరమైన కేసులు పెడుతోంది. దేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడుతోంది. పోలీసులు మీకు నచ్చినట్టు చేయగానే కాదు. ఈ దేశంలో న్యాయస్థానం ఉంది. న్యాయం ఇంకా బతికే ఉంది. మహిళా నాయకులు ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ క్లబ్ కు వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. న్యాయం మా వైపు ఉంది. మహిళలు అని కూడా చూడకుండా తీసుకెళ్లి జైలులో పెట్టారు. మేము తొక్కేకొద్దీ ఎదిగే వాళ్లం.. అని అధికార పార్టీకి సవాల్ విసిరారు.
#image_title
ఎప్పుడూ మీరే అధికారంలో ఉండరు. మేమూ అధికారంలోకి వస్తాం అప్పుడు చెప్తాం మీ పని. అప్పుడు అధికారం మా చేతుల్లో ఉంటుంది. మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నారు. అందరినీ ఇబ్బంది పెడుతున్నారు. డైమండ్ రాణి నీకు సిగ్గుందా? పది మందికి అన్నం పెట్టే గుణం కాదు నీది. జనసేన జెండా త్వరలోనే రెపరెపలాడుతుంది. మీరు మమ్మల్ని ఏం చేయలేరు. రైతులు కూడా మా వైపు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిన ప్రభుత్వం మీది. బయటికి వస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతారా? చెప్పులతో కొట్టి మరీ పోలీసులు తరిమికొడతారు అని సుభాషిని మండిపడ్డారు.
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
Modi Decisions : దేశంలో స్వచ్ఛంద సంస్థల పేరుతో విదేశాల నుండి వచ్చే నిధుల వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు…
Visakhapatnam Murder Case ప్రశాంతతకు మారుపేరైన విశాఖపట్నం Visakhapatnam నగరంలో నెత్తురోడింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ శ్రద్ధా వాకర్…
YS Jagan Arrest: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా జగన్ అరెస్ట్ అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో…
This website uses cookies.