
Manifestos : కూటమి మేనిఫెస్టో కూడా విడుదల.. వైసీపీ, కూటమి మేనిఫెస్టో వ్యత్యాసాలివే.!
Manifestos : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం స్పీడెక్కిపోతుంది. ఎవరికి వారు మేనిఫెస్టోలని ప్రకటిస్తూ రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో విడుదల కాగా, ఇప్పుడు తాజాగా టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదలయ్యింది. ఈ మేరకు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం..” అనే నినాదంతో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మెగా డీఎస్సీపై మొదటి సంతకం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి, దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు! , బీసీలకు 50 ఏళ్లకే పింఛను, వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. , ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్, రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్, ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం, నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ, ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మాణులకు నెలకు రూ.25వేలు గౌరవేతనం.. అలాగే వారి షాపులకు 200 యూనిట్ల వరకు ఉచితం.
Manifestos : కూటమి మేనిఫెస్టో కూడా విడుదల.. వైసీపీ, కూటమి మేనిఫెస్టో వ్యత్యాసాలివే.!
మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం, స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్, డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, రాజధానిగా అమరావతి కొనసాగింపుగా ఉంటుందని అన్నారు. ఇక్కడ వ్యత్యాసాలు చూస్తే.. వైసీపీ మ్యానిఫెస్టోలో వృద్ధాప్య పెన్షన్లను ప్రస్తుతం ఉన్న రూ.3 వేల నుంచి వచ్చే ఐదేళ్లలో రూ.3500కి పెంచుతామని అన్నారు. కూటమి మాత్రం వృద్దాప్య ఫించన్ ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము రూ.13,500 నుంచి రూ.16 వేలకు వైసీపీ చెబితే .. టీడీపీ జనసేన బీజేపీ కూటమి మాత్రం ఏడాదికి ఏకంగా రూ.20 వేలు ఇస్తామని ప్రకటించింది. వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు అమల్లోకి తెస్తామని ప్రకటించగా.. ఎన్డీయే కూటమి అమరావతే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పింది.ఇలా పలు రకాలుగా వైసీపీని మించి టీడీపీ మేనిఫెస్టో ఉంది.
Gold and Silver Rate Today 8 March 2026 : గత వారం రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చి,…
Raw Onions : వేసవికాలం ప్రారంభమయ్యే సరికి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులు,…
Spinach : వేసవి కాలం మొదలైతే ఎండలు రోజురోజుకు తీవ్రంగా మారుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శరీరాన్ని అలసటకు గురిచేయడమే కాకుండా…
zodiac signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం ఎంతో ప్రాధాన్యం కలిగి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన గ్రహాల కలయికలు…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కేవలం పాలనలోనే కాకుండా మాటతీరులో…
Sanitation Worker : నిజాయతీకి వెలకట్టలేమని, అది మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనమని తమిళనాడుకు చెందిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలు మరోసారి…
YCP Vs TDP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శాసన మండలి చుట్టూ పెద్ద చర్చ జరుగుతోంది. అసలు ఈ…
హైదరాబాద్లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన సీఎస్ఐఆర్ - నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NGRI) నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని…
Vijay-Trisha : దశాబ్దాల కాలంగా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న త్రిష కృష్ణన్, తన నటనతో ఎంతగా…
Viral Video : ఉప్పల్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ చోటుచేసుకున్న ఒక సంఘటన అన్నం విలువను, ఆకలి తీవ్రతను సమాజానికి…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఒకవైపు…
This website uses cookies.