Manifestos : కూటమి మేనిఫెస్టో కూడా విడుదల.. వైసీపీ, కూటమి మేనిఫెస్టో వ్యత్యాసాలివే.!
Manifestos : ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం స్పీడెక్కిపోతుంది. ఎవరికి వారు మేనిఫెస్టోలని ప్రకటిస్తూ రాజకీయాలపై మరింత ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టో విడుదల కాగా, ఇప్పుడు తాజాగా టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదలయ్యింది. ఈ మేరకు ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. ఏపీ ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం..” అనే నినాదంతో టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేశారు. మెగా డీఎస్సీపై మొదటి సంతకం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం
18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి, దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు! , బీసీలకు 50 ఏళ్లకే పింఛను, వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు, యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. , ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్, రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం, ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్, ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం, నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ, ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మాణులకు నెలకు రూ.25వేలు గౌరవేతనం.. అలాగే వారి షాపులకు 200 యూనిట్ల వరకు ఉచితం.
Manifestos : కూటమి మేనిఫెస్టో కూడా విడుదల.. వైసీపీ, కూటమి మేనిఫెస్టో వ్యత్యాసాలివే.!
మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం, స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్, డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, రాజధానిగా అమరావతి కొనసాగింపుగా ఉంటుందని అన్నారు. ఇక్కడ వ్యత్యాసాలు చూస్తే.. వైసీపీ మ్యానిఫెస్టోలో వృద్ధాప్య పెన్షన్లను ప్రస్తుతం ఉన్న రూ.3 వేల నుంచి వచ్చే ఐదేళ్లలో రూ.3500కి పెంచుతామని అన్నారు. కూటమి మాత్రం వృద్దాప్య ఫించన్ ను రూ.4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము రూ.13,500 నుంచి రూ.16 వేలకు వైసీపీ చెబితే .. టీడీపీ జనసేన బీజేపీ కూటమి మాత్రం ఏడాదికి ఏకంగా రూ.20 వేలు ఇస్తామని ప్రకటించింది. వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు అమల్లోకి తెస్తామని ప్రకటించగా.. ఎన్డీయే కూటమి అమరావతే రాజధానిగా కొనసాగిస్తామని చెప్పింది.ఇలా పలు రకాలుగా వైసీపీని మించి టీడీపీ మేనిఫెస్టో ఉంది.
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
This website uses cookies.