Pawan kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై తిరగబడుతున్న జనసైనికులు..? తిరుపతి తిరుగుబాటు

Advertisement
Published by
Advertisement

Pawan kalyan : తిరుపతి ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని పోటీలోకి దించాలని జనసే, బీజేపీ నిర్ణయించాయి. అయితే ఆ అభ్యర్థి బీజేపీ తరఫు నుంచి బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ ఏపీ ఇంఛార్జి మురళీధరన్ వెల్లడించారు. ఈ నిర్ణయం.. జనసైనికుల్లో తీరని నిరాశను రేకెత్తించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌  ఏవిధంగా మద్ధతిచ్చారంటూ జనసేన నేతలు.. ఆయనపై మండిపడుతున్నారట. మరి ఈ నిర్ణయం వెనుక ఏం జరిగిందన్నదే హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Pawan kalyan decision in the tirupati by election

Pawan kalyan : సైడ్ ఇచ్చిన జనసేనాని

తిరుపతిలో మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటే.. లేదు మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటూ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతల మధ్య కొంత కాలంగా సాగుతున్న పోరుకు ఎట్టకేలకు తెరపడింది. చివరికి అక్కడ పోటీలో నిలిచేది బీజేపీ అభ్యర్థే అని తేలింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఇంచార్జీ వి. మురళీధరన్‌ను ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన.. ప్రజల కోసం పోరాడేందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థి ఎంపికపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ మంతనాలు జరిపారని, ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థిని తిరుపతి ఉప ఎన్నికల్లో నిలబెట్టాలని ఏకగ్రవంగా నిర్ణయించినట్లు మురళీధరన్ వెల్లడించారు.

Advertisement

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయన్న ఆయన.. ఈ ఎన్నికల్లో విజయం తమదే అని విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుపతి ఎన్నికల్లో ఘన విజయంతో రాష్ట్రంలో విజయ యాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. బీజేపీ, జనసేన కలిసి.. వైసీపీ, టీడీపీల అసలు రంగును బయటపెడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను ఆ రెండు పార్టీల కబందహస్తాల నుంచి విముక్తి కల్పిస్తామని అన్నారు. వైసీపీ, టీడీపీలు తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించిన మురళీధరన్.. ఈ ఉప ఎన్నికలో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆ రెండు పార్టీలు అవలంభిస్తున్న పక్షపాత విధానాలను అంతమొందించే సమయం ఆసన్నమైందని, తిరుపతి ప్రజలు వైసీపీ, టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

కాగా, తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు త్వరలో షెడ్యూల్ విడుదల కానుండగా.. ప్రధాన పార్టీలు పోటీకి సై అంటే సై అంటున్నాయి. ఇప్పటికే టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించి ఈ ఎన్నికల పోరులో ముందు వరుసలో ఉంది. ఇక సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ ఇంకా తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరోవైపు ఇంతకాలం జనసేన, బీజేపీ మధ్య అభ్యర్థి ఎంపికపై తీవ్ర చర్చలు జరిగాయి. తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటే.. లేదు తామే పోటీ చేస్తామంటూ రెండు పార్టీల నేతలు గట్టిగానే వాదులాడారు. చివరికి ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో సయోధ్య కుదరడంతో.. తిరుపతి ఉప పోరులో బీజేపీ అభ్యర్థినే పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయం బీజేపీ నాయకులు ఫుల్ ఖుషీ అవుతుందగా, జనసైనికులు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. జనసేన అయితే గట్టి పోటీ ఇచ్చేదని, బీజేపీకి ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Recent Posts

Vijaya Milk : విజయ పాలు బ్రాండ్ గొడవ ఏంటి .. అసలేం జరిగింది .. ?

Vijaya Milk : తెలుగు రాష్ట్రాల్లో విజయ డైరీ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలుగా పాడి రైతులకు అండగా…

2 hours ago

YS Jagan : తెలంగాణాలో బయటపడ్డ జగన్ సరికొత్త స్కాం .. !

YS Jagan : తెలుగు రాష్ట్రాల్లో ఎంతో నమ్మకానికి మారుపేరుగా ఉన్న విజయ డైరీ ఉత్పత్తుల విషయంలో ఇప్పుడు కొత్త…

3 hours ago

Tirumala : ఇప్పుడే అందిన బిగ్ బ్రేకింగ్ : తిరుమలలో ఏం జరిగిందో తెలుసా..!

Tirumala : తిరుమల శ్రీవారి కి భక్తులు ఎంతో భక్తితో సమర్పించుకునే కానుకల విషయంలో ఒక సంచలనమైన దొంగతనం వెలుగులోకి…

4 hours ago

YS Jagan : ఏపీ ఉలిక్కిపడే బ్రేకింగ్ : జగన్ బెంగుళూరులో సీక్రెట్ గా ఎవరిని కలిసాడు

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. ఎన్నికల తర్వాత కొంచెం సైలెంట్ గా ఉన్న…

5 hours ago

TKGKS – KANA – Khammam : లక్ష్మీపురం మహిళకు కుట్టు మిషన్ అందించిన కౌండిన్య అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా

TKGKS - KANA - Khammam  : ఖమ్మం జిల్లా వైరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ…

6 hours ago

Revanth Reddy : రేవంత్ రెడ్డి ని బానే పటాయించిన అల్లూ అర్జున్ .. CM సంచలన నిర్ణయం..!

Revanth Reddy : హైదరాబాద్ నగరం మరో అద్భుతమైన వినోద కేంద్రానికి వేదిక కాబోతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…

7 hours ago

Sardar Papanna statue : త్వరలోనే ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ..!

Sardar Papanna statue : తెలంగాణ చరిత్రలో అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప వీరుల్లో సర్దార్ సర్వాయి పాపన్న…

7 hours ago

IPL 2026 : SRH కెప్టెన్గా కమిన్స్‌ లేకుంటే ఎవరు మరీ? .. రేసులో ఉన్న ముగ్గురు ఆటగాళ్లు వీళ్లేనా ..!

IPL 2026 : టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో గెలిచిన…

8 hours ago

HPCL Recruitment 2026 : నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ .. రూ.30,000 వేల జీతంలో HPCLలో భారీ ఉద్యోగావకాశాలు..!

HPCL Recruitment 2026 : ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ…

9 hours ago

Central Govt : డీజిల్, గ్యాస్ కొరతకు కేంద్రం చెక్ .. చమురు శుద్ధి సంస్థలపై ఎస్మా అమలు ..!

Central Govt : దేశంలో డీజిల్, వంటగ్యాస్ వంటి ఇంధనాల కృతిమ కొరత ఏర్పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…

10 hours ago

PM Shram Yogi Mandhan Yojana : కార్మికులకు శుభవార్త .. కేంద్రం సరికొత్త పథకం .. నెలకు ₹3,000 పెన్షన్ అర్హతలు, అప్లై విధానం ఇదే ..!

PM Shram Yogi Mandhan Yojana : దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కోట్లాది మంది కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన…

11 hours ago

Rashmi Gautam : ఆ వ్యక్తుల పేర్లు కూడా ప్రూఫ్‌తో చెప్పండి .. ట్రోలింగ్ పై ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రష్మి గౌతమ్

Rashmi Gautam : తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా, నటిగా మంచి గుర్తింపు సంపాదించిన రష్మి గౌతమ్ మరోసారి సోషల్ మీడియాలో…

12 hours ago