Pawan kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పై తిరగబడుతున్న జనసైనికులు..? తిరుపతి తిరుగుబాటు

Advertisement
Published by
Advertisement

Pawan kalyan : తిరుపతి ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థిని పోటీలోకి దించాలని జనసే, బీజేపీ నిర్ణయించాయి. అయితే ఆ అభ్యర్థి బీజేపీ తరఫు నుంచి బరిలోకి దిగుతున్నట్లు ఆ పార్టీ ఏపీ ఇంఛార్జి మురళీధరన్ వెల్లడించారు. ఈ నిర్ణయం.. జనసైనికుల్లో తీరని నిరాశను రేకెత్తించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌  ఏవిధంగా మద్ధతిచ్చారంటూ జనసేన నేతలు.. ఆయనపై మండిపడుతున్నారట. మరి ఈ నిర్ణయం వెనుక ఏం జరిగిందన్నదే హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Pawan kalyan decision in the tirupati by election

Pawan kalyan : సైడ్ ఇచ్చిన జనసేనాని

తిరుపతిలో మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటే.. లేదు మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటూ మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతల మధ్య కొంత కాలంగా సాగుతున్న పోరుకు ఎట్టకేలకు తెరపడింది. చివరికి అక్కడ పోటీలో నిలిచేది బీజేపీ అభ్యర్థే అని తేలింది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఇంచార్జీ వి. మురళీధరన్‌ను ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ఆయన.. ప్రజల కోసం పోరాడేందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారని స్పష్టం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థి ఎంపికపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ మంతనాలు జరిపారని, ఈ సమావేశంలో బీజేపీ అభ్యర్థిని తిరుపతి ఉప ఎన్నికల్లో నిలబెట్టాలని ఏకగ్రవంగా నిర్ణయించినట్లు మురళీధరన్ వెల్లడించారు.

Advertisement

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయన్న ఆయన.. ఈ ఎన్నికల్లో విజయం తమదే అని విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుపతి ఎన్నికల్లో ఘన విజయంతో రాష్ట్రంలో విజయ యాత్ర ప్రారంభం అవుతుందని అన్నారు. బీజేపీ, జనసేన కలిసి.. వైసీపీ, టీడీపీల అసలు రంగును బయటపెడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను ఆ రెండు పార్టీల కబందహస్తాల నుంచి విముక్తి కల్పిస్తామని అన్నారు. వైసీపీ, టీడీపీలు తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసే విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించిన మురళీధరన్.. ఈ ఉప ఎన్నికలో ప్రజలే వారికి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆ రెండు పార్టీలు అవలంభిస్తున్న పక్షపాత విధానాలను అంతమొందించే సమయం ఆసన్నమైందని, తిరుపతి ప్రజలు వైసీపీ, టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

కాగా, తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ హఠాన్మరణంతో ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు త్వరలో షెడ్యూల్ విడుదల కానుండగా.. ప్రధాన పార్టీలు పోటీకి సై అంటే సై అంటున్నాయి. ఇప్పటికే టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించి ఈ ఎన్నికల పోరులో ముందు వరుసలో ఉంది. ఇక సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ ఇంకా తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. మరోవైపు ఇంతకాలం జనసేన, బీజేపీ మధ్య అభ్యర్థి ఎంపికపై తీవ్ర చర్చలు జరిగాయి. తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారంటే.. లేదు తామే పోటీ చేస్తామంటూ రెండు పార్టీల నేతలు గట్టిగానే వాదులాడారు. చివరికి ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చల్లో సయోధ్య కుదరడంతో.. తిరుపతి ఉప పోరులో బీజేపీ అభ్యర్థినే పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయం బీజేపీ నాయకులు ఫుల్ ఖుషీ అవుతుందగా, జనసైనికులు మాత్రం తీవ్ర నిరాశలో మునిగిపోయారు. జనసేన అయితే గట్టి పోటీ ఇచ్చేదని, బీజేపీకి ఎందుకు వదిలేశారని ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Recent Posts

Heat Stroke : వడదెబ్బ ప్రాణాంతకం కావచ్చు దాని లక్షణాలు, ఈ నివారణ చర్యలను పాటించండి

Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండ‌లు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కార‌ణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…

9 hours ago

Ganji Benefits : ప్రతి రోజూ గంజి తాగితే .. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టొచ్చు .. !

Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…

2 days ago

Summer Health Drink : ఎండాకాలంలో చల్లదనం ఇచ్చే పవర్ డ్రింక్ .. వేసవిలో దీని ప్రయోజనాలు అపారం ..!

Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…

2 days ago

Mint : ఆరోగ్యానికి మేలు చేసే పుదీనా .. మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా ?

Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…

2 days ago

TRS : ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే .. కవిత కొత్త పార్టీ పై బీఆర్ఎస్ విమర్శలు ..!

TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…

2 days ago

Kavitha : మారిన మర మనిషిలా కేసీఆర్‌ .. తండ్రి పై కవిత సంచలన వ్యాఖ్యలు .!

Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…

2 days ago

PM Kisan Maandhan : రైతన్నకు భరోసా .. ప్రతి నెలా రూ.3 వేలు ..కేంద్రం అందిస్తున్న ఈ పథకం తెలుసా? .. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే..!

PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…

2 days ago

Rice Porridge : గంజి నీళ్లను పారబోస్తున్నారా? .. ఇలా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు!

Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…

3 days ago

Sugarcane,lemon, coconut water : చెరకు రసం, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు .. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఏది తాగితే మంచిది?

Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…

3 days ago

Zodiac Signs : రాహు–కేతువుల సంచారం .. ఈ మూడు రాశులపై చెడు ప్రభావం .. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…

3 days ago

Virat Kohli : మ‌రో చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ..!

Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొద‌టి స్థానంలో…

3 days ago

Double Bedroom Houses : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం కొత్త విధానం .. వారికి కేటాయించిన ఇళ్లు వెనక్కి ..!

Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…

3 days ago