Revanth Reddy : రైతు భరోసాపై నలుగురిలో అనేక అనుమానాలు.. శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి
Revanth Reddy : రైతు భరోసా విషయంలో కొద్ది రోజులుగా అందరిలో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి పూర్తి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రతీ సంవత్సరం రైతులకు ఎకరానికి రూ.12,000 చొప్పున ఇవ్వాలి అని నిర్ణయించింది. ఇందులో ఇన్ని ఎకరాలకు మాత్రమే అనే పరిమితి లేదు. వ్యవసాయం చెయ్యడానికి అనుకూలంగా ఉన్న, అలాగే సాగు చేస్తున్న ప్రతీ ఎకరానికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇది రైతులకు, కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. ఐతే.. భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.
Revanth Reddy : రైతు భరోసాపై నలుగురిలో అనేక అనుమానాలు.. శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి
భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ కింద ఏటా రూ.12 వేలు సాయం అందించేందుకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం వెల్లడించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు పంపిణీ జరగనుంది. ఇక ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ జరగనుంది. ఇక కేబినేట్లో పలు నిర్ణయాలు తీసుకోగా, వాటిలో పంచాయతీరాజ్లో 508 కారుణ్య నియామకాలు, కొత్త గ్రామ పంచాయతీలకు కేబినెట్ ఆమోదం, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు జైపాల్ రెడ్డి పేరు, పాలమూరు ప్రాజెక్టు ప్యాకేజీ-2 వ్యయం రూ.1,784 కోట్లకు పెంపు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్లో 588 కారణ్య నియామకాలకు ఆమోదం, 56 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో వీలినానికి గ్రీన్సిగ్నల్, టూరిజం, క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ, సాగునీటి సంఘాల పునరుద్ధరణ వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రభుత్వం రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బును.. రెండు విడతలుగా ఇవ్వబోతోంది. మొదటి విడతను జనవరి 26న గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) నుంచి రైతుల అకౌంట్లలో జమ చేస్తామని తెలిపింది. అంటే రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.6,000 చొప్పున జమ చేస్తారు. అలాగే రైతు కూలీలకు రూ.6,000 జమచేస్తారు. ఇలా అందరు అర్హుల అకౌంట్లలో మనీ జమ అవ్వడానికి ఓ 10 రోజులు పట్టొచ్చు.పెద్దగా షరతులు లేవు కాబట్టి.. ప్రభుత్వానికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు భారీగా ఖర్చవుతుంది. రైతు భరోసా కోసం ప్రభుత్వం రూ.7,800 కోట్ల దాకా కేటాయించాల్సి ఉంటుంది. అలాగే.. ఆత్మీయ భరోసా కోసం రూ.12,000 కోట్లు అవసరం అవుతాయని అంచనా. అంటే దాదాపు రూ.20వేల కోట్లను జనవరి 25 లోగా ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇది పెద్ద సవాలే.
TTD Recruitment 2025 : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) రిక్రూట్మెంట్ 2025లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి…
Ashada Masam : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఆషాడ మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక…
Health Tips : ఎంతో పవిత్రంగా భావించే ఈ మొక్క ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఔషధ ఘనీ అని…
Kannappa Movie Review : తెలుగు చిత్ర పరిశ్రమలో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…
kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్గా విడుదల కానుంది.…
Ram charan : గ్లోబల్ స్టార్ రామ్చరణ్ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్లోని శిల్పకళా…
Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా భారతీయుడు శుభాంశు…
Father : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…
This website uses cookies.