Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలు జోరుణ ప్రచారాలు చేస్తూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ ప్రజాగాళం పేరుతో భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఇక ఈ ప్రజా గళం సభలో భాగంగా ఇటీవల గాజువాక వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇక ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఇక ఈ ప్రజా గళం సభలో భాగంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల విజయవాడలో జగన్ పై జరిగిన రాయిదాడిపై కూడా చంద్రబాబు స్పందించారు.
ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విజయవాడలో మొన్న జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు రోడ్లపై రోడ్ షో చేశారు. ఆయన చుట్టూ భారీ బందోబస్తు తో పోలీసులు కూడా ఉన్నారు. ఆ సమయంలో పవర్ కట్ అయిందట. మరి ఇప్పుడు అధికారంలో ఉంది ఎవరి గవర్నమెంట్ అంటూ చంద్రబాబు నిలదీశారు. నీ ప్రభుత్వ హయాంలో పవర్ కట్ ఎలా అయిందో నీకే తెలియకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పై రాయి వేస్తే నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను అంటూ తెలియజేశారు. నువ్వే కదా ముఖ్యమంత్రి నేను కాదు కదా. ఒకప్పుడు ఇలాగే కోడి కత్తి డ్రామా చేసావు. గొడ్డలి తో సొంత బాబాయిని చంపి ఆ నేరని నాపై నెట్టే ప్రయత్నం చేశావు.
కానీ ఇప్పుడు నీ చెల్లె రోడ్డుపైకి వచ్చి బాబాయ్ ని ఎందుకు చంపావు అంటూ అడుగుతుంది. దానికి జగన్ సమాధానం చెప్పాల్సిందిగా చంద్రబాబు కోరారు..ఇక ఇదే సమయంలో చంద్రబాబు మాట్లాడుతుండగా ఓ వ్యక్తి చంద్రబాబు పై రాయి దాడి చేసే ప్రయత్నం చేశాడు. కానీ అప్రమత్తమైన పోలీసులు ఆ దాడిని వెంటనే తిప్పి కొట్టి నిందితుని పట్టుకునే ప్రయత్నం చేశారు కాని అతను దొరక్కుండా పారిపోయాడు. , ఇక ఈ విషయంపై చంద్రబాబు స్పందిస్తూ వాడు కచ్చితంగా వైసీపీ గూండానే అయి ఉంటాడు అంటూ చెప్పుకొచ్చారు. మీరు చేసే రాళ్ల దాడికి నేను భయపడనంటూ సమాధానం ఇచ్చాడు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.