YS Sharmila : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక వైఎస్ జగన్ ఒంటరి పోరు చేస్తుంటే మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇక కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారు. ఇప్పటివరకైతే ఆమె ఎక్కడి నుంచో పోటీ చేస్తారు అనే దానిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక తాజాగా విజయవాడలో ఆంధ్ర రత్న భవన్లో వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ వైసీపీ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ సిద్ధం సభల పేరుతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటుందని ఆమె విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు చేస్తుందని, మొత్తం ఈ సభల కోసం 600 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఇదంతా ఎవరి డబ్బు అని ఆమె ప్రశ్నించారు.
గత ఎన్నికల ప్రచారంలో వైయస్ జగన్ ఇచ్చిన మాట మరిచారని 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తామన్నారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ చేశారు. రెండు నెలలు ఎన్నికలు ఉండగా నోటిఫికేషన్ ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు . కావలసిన వాళ్లకే వాలంటీర్ల పేరిట ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలపై మేము నిలదీస్తే తీవ్రవాదుల్లా చూశారు. హౌస్ అరెస్టులు చేశారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు కూడా లేదా అని ఆమె ప్రశ్నించారు. ఇక కేంద్రంలో బీజేపీ 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం 20 కోట్ల ఉద్యోగాలు రావాలి కానీ ఇవ్వలేదు అంటూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై వైయస్ షర్మిల మండిపడ్డారు. ఇక టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ చేరటంపై వైయస్ షర్మిల స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు. గతంలో బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్న విషయాన్నీ గుర్తు చేశారు. అమిత్ షా, చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ దొంగలేనని ఆమె ఆరోపించారు.
అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటని ప్రశ్నించారు. గతంలోనూ ఐదేళ్లు పొత్తు పెట్టుకున్నారని ఏపీకి బీజేపీ ఏమిచ్చిందని వైయస్ షర్మిల ప్రశ్నించారు. అప్పుడేం సాధించారనేది కూడా ప్రజలకు చెప్పాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇక తాను ఎక్కడినుంచి పోటీ చేయాలో దాని గురించి చర్చిస్తున్నామని దానిపై పలు అంశాలను పరిశీలిస్తున్నామని ఆమె తెలిపారు. త్వరలోనే ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెబుతామని అన్నారు. ఇక వైయస్ షర్మిల ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే పరిస్థితి కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కనుమరుగైన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడిప్పుడే పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏంటో చూడాల్సి ఉంటుందని అంటున్నారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.