Home » News » 4 Tragic Days In Rinku Singh Life And Fans Ask Why Was He Recalled
News

Rinku Singh Father Death: తండ్రి మరణం.. ప్లేయింగ్ 11లో దక్కని చోటు, రింకూ సింగ్ జీవితంలో 4 విషాద రోజులు..!

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: February 27, 2026 12:34 pm
Advertisement

Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh జీవితంలో పూడ్చుకోలేని తీవ్ర విషాదం నెలకొంది. మైదానంలో తన అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న రింకూ.. ఇప్పుడు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాడు. గత కొంతకాలంగా అడ్వాన్స్‌డ్ స్టేజ్ కాలేయ క్యాన్సర్‌తో Stage-4 Liver Cancer పోరాడుతున్న ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ Khanchand Singh శుక్రవారం ఫిబ్రవరి 27న గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అయితే, రింకూ సింగ్ తండ్రి మరణం అభిమానుల హృదయాలను కలచివేయడమే కాకుండా.. టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో ఒక పెద్ద చర్చకు దారితీస్తోంది.

Advertisement

Rinku Singh Father Death: తండ్రి మరణం.. ప్లేయింగ్ 11లో దక్కని చోటు, రింకూ సింగ్ జీవితంలో 4 విషాద క్షణాలు!

Rinku Singh Father Death దినదిన గండంగా గడిచిన ఆ నాలుగు రోజులు

గత నాలుగు రోజులు రింకూ సింగ్ జీవితంలో ఒక పీడకల లాంటివి. ఒకవైపు తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉండటం, మరోవైపు దేశం కోసం ఆడాల్సిన బాధ్యత.. ఈ రెండింటి మధ్య ఆ యువ ఆటగాడు ఎంతలా నలిగిపోయాడో ఈ టైమ్‌లైన్ చూస్తే అర్థమవుతుంది.

Advertisement

ఫిబ్రవరి 24 – తండ్రికి దగ్గరగా: రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న టీమ్ ఇండియా క్యాంప్ నుంచి రింకూ హుటాహుటిన గ్రేటర్ నోయిడాకు చేరుకున్నాడు. వెంటిలేటర్‌పై ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తండ్రిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

ఫిబ్రవరి 25 – జట్టులోకి రీఎంట్రీ: కుటుంబం ఒకవైపు కన్నీరుమున్నీరు అవుతున్నప్పటికీ, దేశం పట్ల ఉన్న బాధ్యతతో.. మనసును రాయి చేసుకుని రింకూ సింగ్ చెన్నైలో ఉన్న భారత జట్టుతో తిరిగి చేరాడు.

Advertisement

ఫిబ్రవరి 26 – ప్లేయింగ్ 11లో దక్కని చోటు: జింబాబ్వేతో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. కానీ, టాస్ సమయంలో అందరికీ ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. అదేంటంటే.. తుది జట్టులో (Playing 11) నుంచి రింకూ సింగ్‌ను తప్పించారు. అతని స్థానంలో జట్టు కూర్పులో భాగంగా సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చారు. రింకూ డగౌట్‌కే పరిమితం అయ్యాడు.

ఫిబ్రవరి 27 – తండ్రి కన్నుమూత: క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తండ్రి మరణవార్త తెలుసుకున్న రింకూ సింగ్.. జట్టును వదిలి అంత్యక్రియల కోసం తన స్వస్థలమైన అలీఘర్‌కు పయనమయ్యాడు.

అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న

ఇప్పుడు ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని, సగటు మనిషి అడుగుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. “రింకూ సింగ్‌ను తుది జట్టులో ఆడించాలనే ఉద్దేశం టీమ్ మేనేజ్‌మెంట్‌కు లేనప్పుడు, ఆయన తండ్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ కుర్రాడిని తిరిగి జట్టులోకి ఎందుకు పిలిచారు?”

ఒక వ్యక్తి తన తండ్రి చావు బతుకుల మధ్య పోరాడుతున్నప్పుడు ఎలాంటి మానసిక వ్యధను అనుభవిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో కుటుంబానికి కొడుకు అండగా ఉండాలి. టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ రింకూ సింగ్‌ను ఇంటి దగ్గరే ఉండి, తండ్రిని చూసుకోమని చెప్పి ఉండాల్సింది. ఒకవేళ జట్టులోకి పిలిపించుకున్నా.. మ్యాచ్‌లో ఆడే అవకాశం ఇచ్చి ఉంటే కనీసం ఆ కుర్రాడికి దేశం కోసం ఆడుతున్నాననే ఒక సంతృప్తి ఉండేది. కానీ, అటు తండ్రి చివరి క్షణాల్లో ఆయన దగ్గర ఉండనివ్వకుండా, ఇటు మ్యాచ్‌లో ఆడించకుండా బెంచ్‌కే పరిమితం చేయడం ఎంతవరకు సమంజసం అని నెటిజన్లు బీసీసీఐ BCCI, టీమ్ మేనేజ్‌మెంట్‌ను నిలదీస్తున్నారు.

Advertisement

తండ్రి త్యాగమే.. రింకూ విజయ రహస్యం

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన రింకూ సింగ్ కుటుంబ నేపథ్యం అత్యంత సామాన్యమైనది. అతని తండ్రి ఖాన్‌చంద్ సింగ్ ఎన్నో ఏళ్లపాటు గ్యాస్ సిలిండర్లు మోసే కార్మికుడిగా పనిచేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, కొడుకు క్రికెట్ కలలను మాత్రం ఆయన చంపేయలేదు. తన చెమటను ధారపోసి, కొడుకు అంచలంచెలుగా ఎదిగేలా ప్రోత్సహించారు. గతేడాది రింకూ సింగ్.. తన తండ్రి కష్టాన్ని గుర్తించి సుమారు రూ.3.19 లక్షల విలువైన ‘కవాసకి నింజా’ Kawasaki Ninja బైక్‌ను బహుమతిగా ఇచ్చాడు.

క్రికెట్ దిగ్గజాల సంతాపం

రింకూ తండ్రి మరణవార్త తెలుసుకున్న వెంటనే క్రీడా లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ Harbhajan Singh సోషల్ మీడియా (X) వేదికగా స్పందిస్తూ.. “రింకూ సింగ్ తండ్రి మరణవార్త వినడం చాలా బాధాకరం. టీ20 వరల్డ్ కప్ బాధ్యతల్లో ఉంటూనే ఇలాంటి సమయాన్ని ఎదుర్కోవడం రింకూకు ఎంతో కష్టమైన సమయం. ఆ దేవుడు ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలి” అని తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

తన తండ్రి కలలను నిజం చేస్తూ అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదుగుతున్న దశలో, ఆ తండ్రి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం నిజంగా గుండెల్ని పిండేసే విషయం. రింకూ సింగ్ కుటుంబానికి ఈ కష్టకాలంలో మనోధైర్యం కలగాలని ఆశిద్దాం. (ఓం శాంతి).

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి