
Big breaking news.. T20 World Cup 2026 .. ICC gives clarity on India-Pakistan match ..!
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్పై ఇంకా స్పష్టత రాలేదు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హై-వోల్టేజ్ పోరు రాజకీయ, భద్రతా అంశాల మధ్య చిక్కుకుపోయింది. భద్రతా కారణాలను చూపుతూ ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి నిరసనగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తొలుత గట్టి ప్రకటన చేసింది. ఈ పరిణామాలతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహం నెలకొంది.
T20 World Cup 2026 : బిగ్ బ్రేకింగ్ న్యూస్ .. భారత్-పాక్ పోరుపై వీడిన ఉత్కంఠ .. మ్యాచ్ పై పాకిస్థాన్ డిమాండ్లు ..!
ఐసీసీ నుంచి కఠిన హెచ్చరికలు రావడంతో పీసీబీ తన వైఖరిని కొంత సడలించినట్లు తెలుస్తోంది. లాహోర్లో ఐసీసీ ప్రతినిధులతో జరిగిన కీలక సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మూడు ప్రధాన డిమాండ్లను ముందుకు తెచ్చారు. మొదటిగా బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించడంతో ఆ దేశ క్రికెట్ బోర్డుకు జరిగిన ఆర్థిక నష్టాన్ని ఐసీసీ భర్తీ చేయాలని పాకిస్థాన్ కోరుతోంది. రెండవది బంగ్లాదేశ్ జట్టు ఆడకపోయినా వారికి అందాల్సిన ‘పార్టిసిపేషన్ ఫీజు’ను ఐసీసీ చెల్లించాలనే డిమాండ్ చేసింది. ఇక, మూడవది ప్రస్తుతం ఐసీసీ నుంచి తమకు వస్తున్న వార్షిక నిధులు సరిపోవడం లేదని ముఖ్యంగా భారత్–పాక్ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయంలో తమకు ఎక్కువ వాటా కేటాయించాలని పీసీబీ వాదిస్తోంది. ఈ నిధులు పెరిగితేనే భారత్తో మ్యాచ్ ఆడే అంశాన్ని పరిశీలిస్తామని సంకేతాలు ఇచ్చింది. అంతేకాదు భవిష్యత్తులో జరిగే ఐసీసీ మెగా టోర్నీల్లో కనీసం ఒక టోర్నీ నిర్వహణ హక్కులు పాకిస్థాన్కు ఇవ్వాలని కూడా గట్టిగా కోరుతోంది.
పాకిస్థాన్ డిమాండ్ల వెనుక అసలు కారణం ఐసీసీ ఇచ్చిన వార్నింగ్ అని విశ్లేషకులు అంటున్నారు. కేవలం భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తామన్న వాదనను ఐసీసీ స్పష్టంగా తిరస్కరించింది. ఒకవేళ పాకిస్థాన్ తన నిర్ణయంపై నిలబడితే సభ్యత్వ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు భారీ జరిమానాతో పాటు ఇతర కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్కు వాకోవర్ ద్వారా పాయింట్లు దక్కడమే కాకుండా పాకిస్థాన్ నెట్ రన్రేట్పై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అవసరమైతే పీసీబీ సభ్యత్వాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసే అధికారం కూడా ఐసీసీకి ఉందని స్పష్టం చేసింది. ఇక, ఈ టోర్నీకి సహ ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పాకిస్థాన్ను వెనక్కి తగ్గమని కోరుతోంది. భారత్–పాక్ మ్యాచ్ రద్దయితే టికెట్ల విక్రయాలు, పర్యాటకం ద్వారా వచ్చే భారీ ఆదాయం కోల్పోతామని లంక ఆందోళన వ్యక్తం చేసింది. ఐసీసీతో జరిగిన చర్చల వివరాలను పీసీబీ చైర్మన్ నేడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు వివరించనున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మ్యాచ్ జరిగే అవకాశముంది. అయితే ఐసీసీ ఈ డిమాండ్లకు ఎంతవరకు అంగీకరిస్తుందన్నదే ఇప్పుడు అసలైన ఉత్కంఠగా మారింది.
IPL 2026 : నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ…
Ration Card : కేంద్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు అందించాలనే నిర్ణయంతో రాష్ట్రాలకు మార్గదర్శకాలు…
EPFO : దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) ఖాతా ఒక ముఖ్యమైన భద్రతా…
Gold Silver Rates March 28 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే.…
Karthika Deepam 2 March 28th 2026 Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న 'కార్తీక దీపం 2'…
Watermelon vs Cucumber : వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఎండలు మండిపోవడంతో శరీరం త్వరగా డీహైడ్రేషన్కు గురవుతోంది. ఇలాంటి…
Liver Detox Juice : నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యంపై దృష్టి తగ్గిపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.…
Coconut Water Vs Amla Juice : వేసవి కాలం మొదలైతే సూర్యుడు తన తీవ్రతను చూపించడం సహజం. అధిక…
Kurnool : వివాహేతర సంబంధం ఒక కుటుంబాన్ని ఛిద్రము చేయడమే కాకుండా ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్న విషాద ఘటన…
Amaravathi vs YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత ఐదేళ్లుగా అమరావతి రాజధాని అంశం ఒక పెద్ద సంచలనంగా…
Telugu Desam Party : తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక సంచలన వార్త రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.…
IRAN USA : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు కనిపిస్తున్నాయి.…
This website uses cookies.