
Big breaking news.. T20 World Cup 2026 .. ICC gives clarity on India-Pakistan match ..!
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్పై ఇంకా స్పష్టత రాలేదు. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హై-వోల్టేజ్ పోరు రాజకీయ, భద్రతా అంశాల మధ్య చిక్కుకుపోయింది. భద్రతా కారణాలను చూపుతూ ఐసీసీ బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించడాన్ని పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనికి నిరసనగా భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తొలుత గట్టి ప్రకటన చేసింది. ఈ పరిణామాలతో మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న సందేహం నెలకొంది.
T20 World Cup 2026 : బిగ్ బ్రేకింగ్ న్యూస్ .. భారత్-పాక్ పోరుపై వీడిన ఉత్కంఠ .. మ్యాచ్ పై పాకిస్థాన్ డిమాండ్లు ..!
ఐసీసీ నుంచి కఠిన హెచ్చరికలు రావడంతో పీసీబీ తన వైఖరిని కొంత సడలించినట్లు తెలుస్తోంది. లాహోర్లో ఐసీసీ ప్రతినిధులతో జరిగిన కీలక సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మూడు ప్రధాన డిమాండ్లను ముందుకు తెచ్చారు. మొదటిగా బంగ్లాదేశ్ను టోర్నీ నుంచి తప్పించడంతో ఆ దేశ క్రికెట్ బోర్డుకు జరిగిన ఆర్థిక నష్టాన్ని ఐసీసీ భర్తీ చేయాలని పాకిస్థాన్ కోరుతోంది. రెండవది బంగ్లాదేశ్ జట్టు ఆడకపోయినా వారికి అందాల్సిన ‘పార్టిసిపేషన్ ఫీజు’ను ఐసీసీ చెల్లించాలనే డిమాండ్ చేసింది. ఇక, మూడవది ప్రస్తుతం ఐసీసీ నుంచి తమకు వస్తున్న వార్షిక నిధులు సరిపోవడం లేదని ముఖ్యంగా భారత్–పాక్ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయంలో తమకు ఎక్కువ వాటా కేటాయించాలని పీసీబీ వాదిస్తోంది. ఈ నిధులు పెరిగితేనే భారత్తో మ్యాచ్ ఆడే అంశాన్ని పరిశీలిస్తామని సంకేతాలు ఇచ్చింది. అంతేకాదు భవిష్యత్తులో జరిగే ఐసీసీ మెగా టోర్నీల్లో కనీసం ఒక టోర్నీ నిర్వహణ హక్కులు పాకిస్థాన్కు ఇవ్వాలని కూడా గట్టిగా కోరుతోంది.
పాకిస్థాన్ డిమాండ్ల వెనుక అసలు కారణం ఐసీసీ ఇచ్చిన వార్నింగ్ అని విశ్లేషకులు అంటున్నారు. కేవలం భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరిస్తామన్న వాదనను ఐసీసీ స్పష్టంగా తిరస్కరించింది. ఒకవేళ పాకిస్థాన్ తన నిర్ణయంపై నిలబడితే సభ్యత్వ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు భారీ జరిమానాతో పాటు ఇతర కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్కు వాకోవర్ ద్వారా పాయింట్లు దక్కడమే కాకుండా పాకిస్థాన్ నెట్ రన్రేట్పై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అవసరమైతే పీసీబీ సభ్యత్వాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేసే అధికారం కూడా ఐసీసీకి ఉందని స్పష్టం చేసింది. ఇక, ఈ టోర్నీకి సహ ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా పాకిస్థాన్ను వెనక్కి తగ్గమని కోరుతోంది. భారత్–పాక్ మ్యాచ్ రద్దయితే టికెట్ల విక్రయాలు, పర్యాటకం ద్వారా వచ్చే భారీ ఆదాయం కోల్పోతామని లంక ఆందోళన వ్యక్తం చేసింది. ఐసీసీతో జరిగిన చర్చల వివరాలను పీసీబీ చైర్మన్ నేడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు వివరించనున్నారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే మ్యాచ్ జరిగే అవకాశముంది. అయితే ఐసీసీ ఈ డిమాండ్లకు ఎంతవరకు అంగీకరిస్తుందన్నదే ఇప్పుడు అసలైన ఉత్కంఠగా మారింది.
PAK vs USA: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. గ్రూప్-A లో…
Congress Party : మున్సిపల్ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా ముఖ్యమంత్రి…
Ram Charan Upasana twins : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ mega power star Ram Charan …
Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా…
Xiaomi 17T Pro : కొత్త స్మార్ట్ఫోన్ కొనాలని అనుకుంటున్న వారికి ఇది నిజంగా సూపర్ న్యూస్. ప్రముఖ మొబైల్…
AI : నేటి ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరగడంతో చాలామంది తమ ఉద్యోగాల భవిష్యత్తు గురించి…
Vivo T3 FE 5G review : ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో (Vivo) భారత మార్కెట్లో మరో విప్లవాత్మక…
This website uses cookies.