Home » News » Suryakumar Yadav Praises Bumrah
News

ICC T20 World Cup 2026 : భారత్ విజయం అతని కారణంగానే సాధ్యమైంది : సూర్యకుమార్ యాదవ్‌

Authored By
Suma
The Telugu News | Published on: March 6, 2026, 10:13 am
Advertisement

ICC T20 World Cup 2026 : ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా మరో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత బౌలర్లు చివరి వరకు పోరాడగా జస్‌ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్‌తో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బుమ్రా ప్రదర్శనను ప్రశంసిస్తూ ఈ విజయం అతని కారణంగానే సాధ్యమైందని పేర్కొన్నాడు.

Advertisement

ICC T20 World Cup 2026 : భారత్ విజయం అతని కారణంగానే సాధ్యమైంది : సూర్యకుమార్ యాదవ్‌

ICC T20 World Cup 2026 : సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ నమోదు చేసి ఇంగ్లండ్‌కు 254 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని అందుకోవడం సులభం కాకపోయినా ఇంగ్లండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడుతూ మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చారు. అయితే భారత జట్టు తరఫున సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని గ్రహించిన శాంసన్ ధైర్యంగా షాట్లు ఆడుతూ పరుగులు సాధించాడు. మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ మాట్లాడుతూ సంజూ శాంసన్ ప్రదర్శనను ప్రత్యేకంగా అభినందించాడు. గత ఏడాది కాలంగా అతను కష్టపడి సాధన చేస్తున్నాడని ఆ కృషికి ఈ మ్యాచ్ సరైన ఫలితాన్ని ఇచ్చిందని తెలిపాడు. జట్టు పరిస్థితికి తగ్గట్టుగా అతను ఆడిన ఇన్నింగ్స్ చాలా విలువైనదని చెప్పాడు.

Advertisement

ICC T20 World Cup 2026 : జాకోబ్ బెతెల్ శతకం.. ఇంగ్లండ్ పోరాటం

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఇంగ్లండ్ జట్టు కూడా వెనుకడుగు వేయలేదు. ముఖ్యంగా జాకోబ్ బెతెల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్లకు కష్టాలు తెచ్చాడు. 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 105 పరుగులు చేసి మ్యాచ్‌ను చివరి వరకు ఉత్కంఠభరితంగా మార్చాడు. బెతెల్ దూకుడైన ఆటతీరుతో భారత జట్టు కొంతసేపు ఒత్తిడికి గురైంది. ఒక దశలో ఇంగ్లండ్ విజయం సాధిస్తుందేమో అన్న భావన కూడా కలిగింది. మ్యాచ్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఇంగ్లండ్ బ్యాటింగ్ చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని చెప్పాడు. “మీపై గెలవాలంటే మేమింకెన్ని పరుగులు చేయాలి?” అని హ్యారీ బ్రూక్‌తో సరదాగా అన్నానని పేర్కొన్నాడు.

ICC T20 World Cup 2026 : బుమ్రా బౌలింగ్‌తో మ్యాచ్ మలుపు

ఇంగ్లండ్ బ్యాటింగ్ ఉధృతంగా సాగుతున్న సమయంలో జస్‌ప్రీత్ బుమ్రా తన అనుభవాన్ని చూపించాడు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కీలక సమయంలో పరుగులు ఆపి మ్యాచ్‌ను భారత్ వైపు మళ్లించాడు. అతనితో పాటు అర్ష్‌దీప్ సింగ్ కూడా కీలక సమయంలో బౌలింగ్ చేసి జట్టుకు మద్దతు ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ బుమ్రా గురించి ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. భారత్ కోసం అతను ఎన్నేళ్లుగా గొప్ప ప్రదర్శనలు చేస్తున్నాడని, ఈ మ్యాచ్‌లో కూడా అదే బాధ్యతతో బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడని తెలిపాడు. ఇరు జట్ల మధ్య ఉన్న అసలు తేడా బుమ్రానే అని స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ లక్ష్య ఛేదన సమయంలో తాను చాలా టెన్షన్‌కు గురయ్యానని సూర్యకుమార్ చెప్పాడు. ఆ సమయంలో తన హార్ట్ రేట్ 160 నుంచి 175 మధ్యలో ఉండేదని సరదాగా పేర్కొన్నాడు. అయినప్పటికీ జట్టు చివరి వరకు ధైర్యంగా పోరాడి విజయం సాధించిందని చెప్పాడు. సొంతగడ్డపై ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం ఎంతో ఆనందంగా ఉందని, అభిమానుల మద్దతు జట్టుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి