Virat Kohli hugs the Rohit sharma
Virat Kohli : టీమిండియాలో స్టార్ క్రికెటర్స్గా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల మధ్య వైరం నడుస్తుందనే టాక్ కొన్నాళ్లుగా వినిపిస్తుంది. ముఖ్యంగా విరాట కోహ్లీ కెప్టెన్సీ నుండి తప్పుకున్న తర్వాత రోహిత్పై ఆరోపణలు ఎక్కువయ్యాయి. ఇద్దరికి అస్సలు పడట్లేదని, రోహిత్ వల్లనే కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్నాడని ఇలా ఎన్నో వార్తలు హల్చల్ చేశాయి. అయితే వాటన్నింటికి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్తో పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఉప్పల్లో జరిగిన ఆఖరి నిర్ణయాత్మక టీ20 మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని, 2-1 తేడాతో సిరీస్ని సొంతం చేసుకుంది…
187 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 4 బంతుల్లో 1 పరుగు చేసిన కెఎల్ రాహుల్ని తొలి ఓవర్ ఆఖరి బంతికి అవుట్ చేశాడు డానియల్ సామ్స్. 14 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 17 పరుగులు చేసిన రోహిత్ శర్మ, ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది భారత జట్టు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ కలిసి మూడో వికెట్కి 104 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్యకుమార్ యాదవ్ బౌండరీలతో విరుచుకుపడుతుంటే, విరాట్ కోహ్లీ సింగిల్స్ తీస్తూ అతనికి స్ట్రైయికింగ్ ఇవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు…
Virat Kohli hugs the Rohit sharma
ఆఖరి ఓవర్లో టీమిండియా విజయానికి 11 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి బంతికి సిక్సర్ బాదిన విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి బంతికి భారీ షాట్కి ప్రయత్నించి ఆరోన్ ఫించ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్కు తిరిగి వస్తున్న క్రమంలో ఎదురొచ్చి మరీ కోహ్లీని అభినందించాడు రోహిత్ శర్మ. అతని ఆటతీరుని మెచ్చుకున్నాడు. ఇక విజయానికి 5 పరుగులే అవసరమైన దశలో ఇద్దరు డగౌట్ మెట్లపై కూర్చొని మ్యాచ్ వీక్షించారు. గెలిచాక ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సన్నివేశాలని చూసి కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు ఉన్నాయని ప్రచారం చేసే వాళ్లు సైలెంట్ అయ్యారు.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.