
Taxpayers : 75 వేల పన్ను ఆదాకి ఎలాంటి ప్రూఫ్ అక్కర్లేదా..వేతన జీవులు అంతా స్టాండర్డ్ డిడక్షన్కు అర్హులేనా ?
Taxpayers : పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ ఎలా తగ్గించుకోవాలా అని అనేక ప్రయత్నాలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం.అయితే వచ్చే ఆర్థిక సంవత్సరా (2025-26)నికి వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్కు సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వ సన్నద్ధం అయ్యారు. ఎప్పటి మాదిరే వేతన జీవులు ఆదాయం పన్ను చట్టంలో మినహాయింపులు పెంచుతారని ఆశిస్తున్నారు. అయితే భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. కేంద్ర ప్రభుత్వానికి ప్రీ-బడ్జెట్ సిఫారసుల పేరిట కొన్ని ప్రతిపాదనలు చేసింది. మొత్తం 8.2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులను నూతన ఆదాయం పన్ను విధానంలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది.
Taxpayers : 75 వేల పన్ను ఆదాకి ఎలాంటి ప్రూఫ్ అక్కర్లేదా..వేతన జీవులు అంతా స్టాండర్డ్ డిడక్షన్కు అర్హులేనా ?
మాములుగా అయితే పాత పన్ను విధానంలో రూ. 5 లక్షల వరకు ఆదాయంపై రిబేట్ వర్తిస్తుంది. అంటే అంత ఆదాయంపై పన్ను కట్టక్కర్లేదు. ఇంకా.. స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50 వేలుగా ఉంది. కొత్త పన్ను విధానంలో రిబేట్ రూ. 7 లక్షల వరకు ఉండగా.. ఇక్కడ స్టాండర్డ్ డిడక్షన్ గత బడ్జెట్లో రూ. 50 వేల నుంచి రూ. 75 వేలకు పెరిగింది. 1974లో తొలిసారి సెక్షన్ 16 కింద ఈ స్టాండర్డ్ డిడక్షన్ను (ప్రామాణిక తగ్గింపు) అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత పలుమార్లు స్టాండర్డ్ డిడక్షన్ మారుతూ వచ్చింది. 2005-06 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ను తొలగించింది. ఆ సమయంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 30 వేలు లేదా జీతంలో 40 శాతం ఏది తక్కువైతే అది వర్తించేది.
ఇది రూ. 5 లక్షలలోపు ఆదాయంపై మాత్రమే. ఆపైన ఆదాయం ఉంటే స్టాండర్డ్ డిడక్షన్ రూ. 20 వేలుగా ఉండేది. ఆదాయపు పన్ను శ్లాబుల విస్తరణ, మినహాయింపుల కారణంగా స్టాండర్డ్ డిడక్షన్ అవసరం లేదని అప్పటి ప్రభుత్వం అభిప్రాయపడి దీనిని తొలగించింది.అయితే 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత 2018 బడ్జెట్ సమయంలో స్టాండర్డ్ డిడక్షన్ను మళ్లీ తీసుకురావడం జరిగింది. అయితే 2019 బడ్జెట్ సమయంలో దీనిని రూ. 50 వేలకు పెంచింది. ఇక కొత్త పన్ను విధానంలో తొలుత స్టాండర్డ్ డిడక్షన్ లేకున్నా.. తర్వాత 2023 బడ్జెట్ సమయంలో దీనిని కొత్త పన్ను విధానానికి కూడా వర్తింపజేసింది. గతేడాది బడ్జెట్లో కొత్త పన్ను విధానంలో దీనిని రూ. 75 వేలకు పెంచేసింది. శాలరీ ఎంత అనేది సంబంధం లేకుండా.. వేతన జీవులు అంతా స్టాండర్డ్ డిడక్షన్కు అర్హులే.ఒకవైపు ప్రత్యక్షంగా ఆదాయం పన్ను చెల్లిస్తూ, మరోవైపు అధిక జీఎస్టీ రేట్లు చెల్లించాల్సి వస్తున్నదని మధ్య తరగతి పన్నుచెల్లింపుదారులు అంటున్నారు. ఇది అసమానతలకు దారి తీస్తుందని చెబుతున్నారు. పట్టణాల్లో ఆహార వస్తువుల ధరలు ప్రజల డిస్పోజబుల్ ఇన్కం హరించేస్తాయి.
Telangana Municipal Polls 2026 : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ఆధిపత్యాన్ని…
Rajya Sabha : ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి సమయం దగ్గరపడుతుండటంతో, అధికార కూటమిలో అభ్యర్థుల…
Fruits : ఆరోగ్యకరమైన ఆహారం అంటే చాలా మంది ముందుగా గుర్తుచేసుకునేది పండ్లే. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే…
Alcohol : మనలో చాలామంది మద్యం తాగడాన్ని ఒక సాధారణ అలవాటుగా లేదా సరదాగా భావిస్తుంటారు. కానీ మీరు తాగే…
Gold, Silver Rate Today, 13 February 2026 : ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ముంగిట ఉన్న తరుణంలో, ఆకాశాన్నంటుతున్న…
Brahmamudi February 13th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ 'బ్రహ్మముడి' Brahmamudi రోజురోజుకూ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది.…
Ram Charan twins names : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. గ్లోబల్…
Coffee for Memory : ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ వాసన రాకపోతే చాలామందికి రోజు సరిగా మొదలైనట్టే…
This website uses cookies.